రాహుల్ గాంధీ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. మహారాష్ట్ర పౌరులను అవమానించారన్న సీఎం

మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్స్‌పై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. నకిలీ ఓటర్లన్న రాహుల్ గాంధీ వాదనలను ఆయన తిప్పికొట్టారు. చివరి నిమిషంలో అధిక ఓటింగ్ శాతం NDA అనుకూలంగా ఉందనటం హాస్యాస్పదమని ఫడ్నవీస్ అన్నారు.

New Update
FADNAVIS  2

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ కామెంట్స్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నకిలీ ఓటర్లు అనే రాహుల్ గాంధీ వాదనలను ఆయన తిప్పికొట్టారు. రాహుల్ గాంధీ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. చివరి నిమిషంలో అధిక ఓటింగ్ శాతం NDA అభ్యర్థులకు అనుకూలంగా ఉందనే రాహుల్ గాంధీ వాదనలు హాస్యాస్పదమని ఫడ్నవీస్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలచే తిరస్కరించబడిన రాహుల్ గాంధీ ఇప్పుడు వారి నిర్ణయాన్ని వ్యతిరేఖిస్తు్న్నారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు మహారాష్ట్ర పౌరులకు అవమానమని మండిపడ్డారు. అలాంటి వాదనలను ప్రజలు, తాను కూడా క్షమించనని హెచ్చరించారు. 

ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, బిజెపి చీఫ్ జెపి నడ్డా, భారత ఎన్నికల కమిషన్ కూడా గాంధీ వాదనలను తోసిపుచ్చారు. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో పబ్లిష్ అయిన రాహుల్ గాంధీ ఆర్టికల్ విస్మరించబడాలని ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మహారాష్ట్ర ప్రజలను విడగొట్టాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ఆయన ఎన్నికల కమిషనర్ నియామకాలను కూడా తప్పుబట్టిన విషయాన్ని గుర్తు చేశారు ఫడ్నవీస్. 

cm devendra fadnavis | Maharashtra CM Devendra Fadnavis | Rahul Gandhi | maharshtra | elections | ec | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు