Eatala Rajender: రేవంత్ పై కాషాయ బుక్.. ఈటల సంచలన ప్రకటన!

కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కాషాయ బుక్ రాస్తామని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం, ఆయన సలహాదారులు, బంధుమిత్రులు పైరవీలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

New Update
Eatela Vs Revanth

Eatela Vs Revanth

Eatala Rajender: కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కాషాయ బుక్ రాస్తామని బీజేపీ (BJP) ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం, ఆయన సలహాదారులు, బంధుమిత్రులు పైరవీలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతామని వార్నింగ్ ఇచ్చారు. ఐఏఎస్ అధికారులు(IAS Officers) మేధావులని.. వారు గౌరవం కాపాడుకోవాలని సూచించారు. ఐఏఎస్ అధికారులకు 35 ఏళ్ల సర్వీస్ ఉంటుందని.. రాజకీయ నాయకులు 5 ఏళ్లు పదవిలో ఉంటారన్నారు.

Also Read :  మొత్తం రూ.16 వేల కోట్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను తలదన్నేలా.. RTV చేతిలో సంచలన నిజాలు!

Also Read :  భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్ కుమార్ బాధ్యతలు!

Etala Rajender Comments On Revanth Reddy

యదా రాజా తదా ప్రజా ఉంటారు కానీ యదా ప్రజా తదా రాజా ఉండరన్నారు. రేవంత్ (Revanth Reddy) నువ్వు సుద్దపూస కాకుండా వాళ్ళని అంటే ఎలా? అని ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంది ఆ పని చేయలేమని అంటే.. కలెక్టర్ ను మార్చినట్లు పేపర్లో వార్త వచ్చిందన్నారు. అధికారులు నిబద్ధత, నిజాయితీతో ఉండాలని పిలుపునిచ్చారు. ఎస్ బాస్ అంటే జైళ్లకు పోతారు జాగ్రత్త.. అని హెచ్చరించారు. అధికారులు చట్టప్రకారం పనిచేయాలని సూచించారు. 

Also Read :  ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!

Also Read :  Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు