China: చైనా కీలక నిర్ణయం.. జిన్పింగ్ సన్నిహిత జనరల్పై వేటు
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సన్నిహత జనరల్ మియా హువను సెంట్రల్ మిలటరీ కమిషన్ నుంచి తొలగించారు. 2024 నవంబర్లో మియా హువ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై అధికారులు దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకున్నారు.
China: 200 జైళ్లు నిర్మిస్తున్నారు..ఎవరి కోసం జిన్పింగ్!
చైనా లో సర్కారు సరికొత్తగా 200 ప్రత్యేకమైన జైళ్లను నిర్మిస్తోంది.అధ్యక్షుడు జిన్ పింగ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక కార్యక్రమంలో వినియోగించేందుకు వీలుగా వీటిని నిర్మిస్తోంది.
డ్రాగన్ మాయలో పడిన తజిఖిస్తాన్!
ఇటీవలె తజికిస్తాన్ లో చైనా సైనిక స్థావర ఫోటోలు బయటకి వచ్చాయి. చైనా కావాలనే భారత్ పై రహస్య గూఢాచార్యం చేసేందుకే పాక్,శ్రీలంక దేశాలకు రుణాలు ఇచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకుంటుందని గతంలో విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. తాజాగా ఈ ఉదంతం తజికిస్తాన్ లో కూడా వెలుగుచూసింది.
China Financial Crisis : ఆర్థిక ఇబ్బందుల్లో చైనా.. న్యూ ఇయర్ వేళ ప్రెసిడెంట్ జిన్పింగ్ షాకింగ్ ప్రకటన!
రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్న చైనా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ తెలిపారు. ఈ పరిస్థితులు అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
Biden and Xi Jinping Meeting: బాగానే మాట్లాడుకున్నారుగా..మళ్ళీ ఈ ట్యాగ్ లేంటి బైడెన్?
అమెరికా-చైనా రెండూ పెద్ద దేశాలే. పైకి అంతా మామూలుగానే కనిపిస్తున్నా రెండు దేశాలకు మధ్య వాణిజ్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసియా–పసిఫిక్ ఆర్థిక సహకార మండలి(ఏపీఈసీ) శిఖరాగ్ర సదస్సులో భాగంగా దాదాపు ఏడేళ్ల తర్వాత ఇద్దరు నేతలు సమావేశమయ్యారు.
China: 'పిల్లల్ని కనండి ప్లీజ్..' మహిళలను బుజ్జగిస్తోన్న చైనా అధ్యక్షుడు!
చైనాలో జననాల కంటే మరణాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. 1961తర్వాత తొలిసారి జనాభా తగ్గుదలను చవిచూసిన చైనా పిల్లల్ని కనండి మహాప్రభో అని మొత్తుకుంటోంది. దేశ జనాభాలో యువత శాతం తగ్గిపోవడమే దీనికి కారణం. సాక్ష్యాత్తు దేశ అధ్యక్షుడు జిన్పింగే మహిళలకు కీలక సూచనలు చేశారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కుటుంబ సామరస్యం బట్టి మహిళల ఎదుగుదలను చూడాలంటూ జిన్పింగ్ కామెంట్స్ చేశారు.
Vladimir Putin: చైనాలో పుతిన్కు చేదు అనుభవం.. సభలో మాట్లాడుతుండగానే..
చైనాలో పర్యటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్కు చేదు అనుభవం ఎదురైంది. బీజింగ్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగం ప్రారంభించగానే.. ఐరోపాకు చెందిన నేతలు, ప్రతినిధులు సభ నుంచి వెళ్లిపోయారు. బీజింగ్లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ భవనంలో బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి పుతిన్తో పాటు వివిధ దేశాల నేతలు, అలాగే 1000 మందికి పైగా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పుతిన్ మాట్లాడుతుండగా.. ఇలా ఐరోపా నేతలు మధ్యలోనే వెళ్లిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.