Srishti Test Tube Baby Center : స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్... రాత్రికిరాత్రే అంతా మాయం
స్పష్టి ఫర్టిలిటీ సెంటర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జయవాడలోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ను అనుమతి లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్నారని జిల్లా వైద్యాధికారులు ప్రకటించారు. దీంతో ఫెర్టిలిటీ సెంటర్ను రాత్రికి రాత్రే ఎత్తేశారు.
Double Decker Bus: వైజాగ్లో డబుల్ డెక్కర్ బస్సులు.. హ్యాపీగా నగరాన్ని చుట్టేయవచ్చు
వైజాగ్లో త్వరలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభం కానున్నాయి. విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నగరంలో ఈ బస్సులు తిరగనున్నాయి. ఆర్కే బీచ్, తోట్లకొండ, రుషికొండ, సింహాచలం వంటి ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులను తీసుకెళ్లనుంది.
BIG BREAKING: ఏపీలో కరోనా కేసు
విశాఖలో మొదటి కరోనా కేసు కలకలం రేపింది. మద్దిలపాలెంకు చెందిన ఓ మహిళకు కోవిడ్ నిర్ధరణ అయింది. ఆమెతో పాటూ భర్త, పిల్లకు కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారం రోజుల పాటూ క్వారంటైన్ ఉండాలని సూచించారు.
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం
విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం జరిగింది. ఫర్నెస్ నుంచి టర్బో ల్యాడిల్ను ఎస్ఎంఎస్కు తరలించేందుకు కార్లోకి ద్రవ ఉక్కును నింపి ఏర్పాట్లు చేశారు. దీంతో టీఎల్సీకి రంధ్రం పడి ద్రవ ఉక్కు మొత్తం కింద పడింది. దాదాపుగా 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలైంది.
AP News: అయ్యో పాపం.. స్కూటీ పై వెళ్తుంటే చెట్టు విరిగి.. స్పాట్ డెడ్!
విశాఖపట్నం సీతమ్మధారలో ఘోర విషాదం చోటుచేసుకుంది. స్కూటీ మీద వెళ్తున్న మహిళ పై రోడ్డు పక్కన ఉన్న చెట్టు విరిగి పడడంతో అక్కడిక్కడే మృతి చెందింది.
అయ్యో.. మూడేళ్ల క్రితమే పెళ్లి.. సింహాచలంలో సాఫ్ట్వేర్ దంపతులు దుర్మరణం!
సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన 8 మందిలో సాఫ్ట్వేర్ దంపతులు ఉన్నారు. విశాఖకు చెందిన ఉమామహేశ్వరరావు (30), శైలజ (26)కు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఇంతలోనే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
విషాదం.. బైక్పై వెళ్తుండగా చున్నీ చుట్టుకుని మహిళ మృతి
అనకాపల్లిలో విషాదం జరిగింది. భర్తతో బైక్ మీద ఆసుపత్రిగా వెళ్తుండగా రామదుర్గ మెడకు చున్నీ చుట్టుకుంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది. రామదుర్గకు 9 నెలల కిందటే వివాహం జరిగింది. అకాల మరణంతో తల్లిదండ్రులు రోధిస్తున్నారు.