J&K TerrorAttack: పహల్గాం ఉగ్రదాడి.. ఇద్దరు ఏపీ వాసులు మృతి !
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు మృతి చెందారు. విశాఖ కు చెందిన రిటైర్ట్ ఉద్యోగి చంద్రమౌళి ఒకరు.నెల్లూరు కావలికి చెందిన మధుసూదన్ గా అధికారులు గుర్తించారు.
ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్లో YCP గతంలో 58 స్థానాలను కైవసం చేసుకుందని ఆ పార్టీ అధినేత జగన్ అన్నారు. టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచిందన్నారు. అయితే.. ఇప్పుడు కూటమికి మేయర్ పదవి ఎలా వస్తుందని ప్రశ్నించారు.
ఏపీలో క్యాంపస్ పెట్టడానికి అతి పెద్ద టెక్ కంపెనీ ముందు వచ్చింది. మంత్ర లోకేశ్ చొరవతో విశాఖలో టీసీఎస్ రూ.1, 370 కోట్ల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది. దీంతో విభజన తర్వాత ఏపీలో పెట్టబోతున్న అతిపెద్ద టెక్ సంస్థగా టీసీఎస్ నిలవనుంది.
వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విశాఖపట్నం నుండి బెంగళూరు, తిరుపతి, కర్నూలు సిటీకి మొత్తం 42 ప్రత్యేక వారపు రైళ్లను ఏప్రిల్ 13 నుండి మే చివరి వరకు నడపనుంది.
వైజాగ్లో వైసీపీ నేత నరేంద్ర ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో రూ.40 లక్షలు తీసుకుని మోసం చేశాడు. దీంతో టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని కోసం నరేంద్ర పోలీస్ స్టేషన్కు రావడంతో ఆమె ఎస్సై ముందే చెప్పుతో దాడి చేసింది.
భర్త అనుమానిస్తూ వేధిస్తున్నాడనే మనస్తాపంతో కన్నబిడ్డనే చంపేసింది ఓ తల్లి. భార్యాభర్తల మధ్య గొడవలు, ఒకరిపై మరొకరి అనుమానాలకు ఓ చిన్నారి బలైపోయింది. భర్త అనుమానం వేధింపులను తట్టుకోలేని ఆ తల్లి బిడ్డ ప్రాణం తీసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఆంధ్రప్రదేశ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పాటుపడుతోంది. ఇందులో భాగంగా విశాఖలో లులు మాల్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం నిన్న ఆమోదముద్ర వేసింది. దాంతో పాటూ అమరావతి, తిరుపతిల్లోనూ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆ సంస్థను కోరనున్నారు.
విశాఖ స్టీల్ సిటీ వద్ద రోడ్డు ప్రమాద ఘటన జరిగింది. అనకాపల్లి నుంచి కూర్మన్నపాలెం బైక్ మీద ఇద్దరు వ్యక్తులు వెళ్తుండగా.. వీరి ద్విచక్రవాహనాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
విశాఖలో ఎన్ఆర్ఐ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. అమెరికాలో స్థిరపడిన మహిళ ఓ స్థలం లీజ్ అగ్రిమెంట్ కోసం అమెరికా నుంచి వచ్చి శ్రీధర్ అనే వ్యక్తితో హోటల్లో ఉంటుంది. సడెన్గా ఆమె ఉరివేసుకుంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.