కూతురి న*గ్న వీడియో తీశాడని.. | Vizag Gajuwaka Sui*ci*de Incident | RTV
విశాఖ జిల్లా గాజువాకలో దారుణం చోటుచేసుకుంది. పక్కింట్లో ఉండే యువతి న్యూడ్ వీడియోలు తీశాడని ఆమె కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేసి గదిలో బంధించారు. ఈ క్రమంలో ఆ యువకుడు గదిలో ఉరేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో యువతి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్రంలో అర్ధరాత్రి 12 గంటల వరకు హోటల్స్ తెరిచేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. అంతేకాదు లిక్కర్ పాలసీలో లైసెన్స్ ఫీజు రూ.66 లక్షలు అనేది చాలా ఎక్కువని.. త్వరలో దానిని కూడా తగ్గిస్తామని తెలిపారు.
విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరం రిజర్వాయర్లో మునిగి గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి మృతి చెందాడు. విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేట గ్రామానికి చెందిన మీసాల నాని కొమ్మాది గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ లో సివిల్ ఇంజనీర్ థర్డీయర్ చేస్తున్నాడు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో కెన్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు అలుముకోవడంతో కార్మికులు,స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వందే భారత్కు బాగా డిమాండ్ ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని కోచ్ల సంఖ్య పెంచాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఇక మీదట 16 కోచ్లు ఉండనున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారు. ఏపీ అభివృద్ధి చెందేలా రూ.28 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నడుం బిగించాయి. ఈరోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా వీటిని ప్రారభించనున్నారు.