/rtv/media/media_files/2025/05/04/uX1Q7KnQ6cTCDQW6UgHw.jpg)
Badrinath temple gates opened..
Badrinath Temple : ఉత్తరాఖండ్ లో చార్ధామ్ యాత్రలో కీలకమైన బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. ఆదివారం ఉదయం 6 గంటలకు రవి పుష్య లగ్నంలో ద్వారాలను తెరిచారు. చార్ థామ్ యాత్ర ప్రారంభం కావడంతో లక్షలాది మంది భక్తులు బద్రీనాధ్ కు చేరుకున్నారు. ఉదయం గర్వాల్ రైఫిల్స్ కు చెందిన భారత ఆర్మీ భక్తి సంగీతాన్ని వినిపిస్తుండగా దేవాలయ ద్వారాలను పూజారులు తెరిచారు. తొలుత ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ద్వారాలు తెరిచిన వెంటనే జై బద్రీ విశాల్ నినాదాలతో బద్రీనాథ్ ప్రతిధ్వనించింది. ఈ సందర్భంగా హెలికాప్టర్పై నుంచి భక్తులపై పుష్పవర్షం కురిపించారు. బద్రీనాథ్ తలుపులు తెరిచిన వెంటనే గత ఆరు నెలలుగా వెలుగుతున్న అఖండ జ్యోతిని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు ధామ్ చేరుకున్నారు. దాదాపు పదివేల మందికిపైగా బద్రీనాథ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి బద్రినాథ్ చేరుకున్నారు.
#WATCH | Uttarakhand: The portals of Badrinath Dham opened amid melodious tunes of the Army band and chants of Jai Badri Vishal by the devotees pic.twitter.com/BHzt7gWx4V
— ANI (@ANI) May 4, 2025
Also Read: భారత్, పాక్ ప్రభుత్వ పెద్దలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్.. అసలేం జరుగుతోంది?
ఈ సందర్భంగా ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి ఆలయ తలుపులు తెరిచిన తర్వాత స్వామివారిని దర్శించుకొని.. ప్రత్యేక పూజలు చేశారు. వేసవి సందర్భంగా ఆలయ ద్వారాలను తెరిచిన సందర్భంగా.. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దాదాపు 40 క్వింటాళ్ల బంతిపువ్వులతో అందంగా తీర్చిదిద్దారు. ఛార్దామ్ యాత్రలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ ఆలయ ద్వారాలు శుక్రవారం ఉదయం 7 గంటలకు తెరుచుకున్నాయి. అంతకు ముందు అక్షయ తృతీయ రోజున గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. చార్ థామ్ యాత్ర సజావుగా... చార్ థామ్ యాత్ర సజావుగా సాగేందుకు భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. పహల్గామ్ దాడి ఘటనతో అప్రమత్తమైన భద్రతాదళాలు అణువణువునా గాలిస్తున్నారు. నిఘా ఏర్పాటు చేశారు. భక్తులు చార్ ధామ్ యాత్రను సజావుగా ముగించుకుని వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా చార్ ధామ్ యాత్రకు లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.
#WATCH | बद्रीनाथ, चमोली: उत्तराखंड के मुख्यमंत्री पुष्कर सिंह धामी ने श्री बद्रीनाथ धाम में पूजा-अर्चना की।
— ANI_HindiNews (@AHindinews) May 4, 2025
बद्रीनाथ धाम के कपाट आज श्रद्धालुओं के लिए खुल गए हैं। pic.twitter.com/6ZfW2cHw8s
ఇది కూడా చూడండి: కాంగ్రెస్ MLAలపై సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్.. అన్నీ నేనే మాట్లాడాలా..?
ఈ యాత్రకు పోలీసులు, భద్రతా బలగాలు భారీ బందోబస్తును కల్పించాయి. అనుమానిత వ్యక్తులు తారసపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భక్తులు అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది బద్రీనాథ్ యాత్రలో ప్లాస్టిక్ వినియోగించకుండా చూడాలని చమోలి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. బద్రీనాథ్ థామ్, యాత్ర హాల్టులు ఉన్న హోటల్స్, ధాబా నిర్వాహకులకు పాలిథిన్ కవర్ల వాడకాన్ని తగ్గించాలని జిల్లా కలెక్టర్ సందీప్ తివారి ఆదేశాలు జారీ చేశారు. కర్ణప్రయాగ్, గౌచర్, నందప్రయాగ్, పిపాల్కోటి, జ్యోతిర్మథ్, గోవిందాఘాట్, పాండుకేశ్వర్లో ఉన్న హోటళ్ల నిర్వాహకులు తప్పనిసరిగా హోటల్ ఎదుట తప్పనిసరిగా రేట్ల జాబితా బోర్డులు ఉండేలా చూడాలని సూచించారు.
Also Read: రేపు ఈ 3 వస్తువులను తాకితే మీ లైఫ్ ఛేంజ్.. కష్టాలు పరార్.. ఆ వస్తువుల లిస్ట్ ఇదే!
ఇది కూడా చూడండి: డేంజర్ జోన్లో లక్షా యాభైవేల మంది విద్యార్థులు.. పట్టించుకోని యాజమాన్యాలు!