Helicopter Accidents: కేదారనాథ్‌లో 5 హెలికాప్టర్ ప్రమాదాలు.. అసలు కారణం ఏంటో తెలుసా?

ఉత్తరాఖండ్‌లో ఇప్పటి వరకు 5 హెలికాప్టర్ ప్రమాదాలు జరిగాయి. కేదార్‌నాథ్ యాత్రకు పర్యటకులు ఎక్కువగా హెలికాప్టర్‌లో చేరుకోడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో వాతవరణ పరిస్థితిలు, పైలట్లకు సరైన శిక్షణ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

New Update
helicopter Uttarakhand

హెలికాప్టర్ ప్రయాణాలంటే ఒళ్లు జల్లు మంటుంది. గాల్లో దీపం మాదిరి ప్రాణాలు మారిపోయాయి. కేదార్ నాథ్ యాత్ర ప్రారంభమైన నుంచి ఇప్పటి వరకు ఐదు హెలికాప్టర్ ప్రమాదాలు సంభించాయి. అందులోనూ ఈరోజు(ఆదివారం) జరగిన ప్రమాదం చాలా పెద్దది.  డెహ్రాడూన్ నుంచి కేదార్‌నాథ్‌కు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఉత్తరాఖండ్‌లోని గౌరికుండ్ సమీపంలో కూలిపోయింది.  ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్ యాత్ర జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్‌నాథ్ ధామ్‌లకు చేరుకుంటున్నారు. కొంతమంది కాలినడకన చేరుకుంటున్నారు, చాలా మంది హెలికాప్టర్ ద్వారా దర్శనం కోసం ధామ్‌కు చేరుకుంటున్నారు. హెలికాప్టర్‌లో ప్రయాణించే భక్తుల ప్రమాదాల బారిన పడుతున్నారు. 

2025 మే 8 నుంచి జూన్ 7 వరకు జరిగిన నాలుగు హెలికాప్టర్ ప్రమాదాల తీవ్రతను పరిగణనలోకి తీసుకుని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కఠినమైన చర్యలు తీసుకుంది. కెస్ట్రెల్ ఏవియేషన్ సేవలను తక్షణమే నిషేధించారు. చార్‌ధామ్ యాత్ర కోసం హెలికాప్టర్ విమానాలను 35% తగ్గించారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా లోడ్, వాతావరణం, ఎత్తు వంటి ఏవియేషన్ గైడ్‌లైన్స్ ఖచ్చితంగా పాటించాలని DGCA ఆదేశించింది.

ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలివే..

జూన్ 7: కేదార్ వ్యాలీలోని బదాసు హెలిప్యాడ్ నుంచి కేదార్‌నాథ్‌కు బయలుదేరుతుండగా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. పైలట్ రుద్రప్రయాగ్-, గౌరీకుండ్ హైవేపై అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ రోడ్డుపై ఆపి ఉంచిన కారు, సమీపంలోని దుకాణం దెబ్బతిన్నాయి.

మే 8: ఉత్తరకాశిలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఆరుగురు మరణించారు. గాయపడిన ఒకరిని ఎయిమ్స్ రిషికేశ్‌కు తరలించారు. హెలికాప్టర్‌లో పైలట్ సహా ఏడుగురు ఉన్నారు. ఈ ప్రమాదంలో మస్తు భాస్కర్ అనే ఒక ప్రయాణీకుడు గాయపడిన స్థితిలో ప్రాణాలతో బయటపడ్డాడు.

13 మే: ఉఖిమత్‌లో అత్యవసర ల్యాండింగ్ 
బద్రీనాథ్ నుంచి భక్తులతో తిరిగి వస్తున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా తడబడటం ప్రారంభించింది. పైలట్ చాకఛక్యంగా వ్యవహరించి ఉఖిమత్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. దీని వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

7 జూన్: రిషికేశ్‌లోని ఎయిమ్స్ హాస్పిటల్ నుంచి రోగిని తీసుకురావడానికి కేదార్‌నాథ్‌కు వెళ్లిన క్రిస్టల్ ఎయిర్‌లైన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన హెలికాప్టర్ సాంకేతిక లోపం కారణంగా కేదార్‌నాథ్ హైవేపై అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ వెనుక భాగం విరిగిపోయింది. కానీ పైలట్, ఐదుగురు ప్రయాణికులకు ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదు. ఒక కారు స్వల్పంగా దెబ్బతింది. ఈ ప్రమాదం తర్వాత, కేదార్‌నాథ్ హెలికాప్టర్ సర్వీస్‌ను దాదాపు గంటసేపు తాత్కాలికంగా నిలిపివేశారు.

helicopter | helicopter-accident | uttarakhand | helicopter-kedarnath | Kedarnath pilgrimage | kedarnath-yatra | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు