Trump: ట్రంప్ నిర్ణయాలు.. భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం..!
ట్రంప్ సంచలన నిర్ణయాలతో అమెరికా దూసుకెళ్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలోని భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ట్రంప్ సంచలన నిర్ణయాలతో అమెరికా దూసుకెళ్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికాలోని భారత విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
ట్రంప్ టారిఫ్ ఛార్జీల విషయంలో తగ్గేదేలే అంటున్నాడు. మనుషులు జీవించలేదని అంటార్కిటిక్ హిందూ మహాసముద్రంలోని హర్డ్ అండ్ మెక్డొనాల్డ్ దీవులపై 10 టారిఫ్ విధించాడు. వీటితోపాటు ఆస్ట్రేలియా కిందకి వచ్చే మరోకొన్ని దీవులపై కూడా ట్రంప్ భారీగా సుంకాలు విధించాడు.
విదేశాలపై ట్రంప్ టారీఫ్ ప్రకటనతో స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. అమెరికాతో పాటు అన్ని ప్రధాన మార్కెట్లు కూడా పతనమవుతున్నాయి. ఈ టారిఫ్ల నిర్ణయం అమెరికాను మాంద్యంలోకి తీసుకెళ్లే ఛాన్స్ ఉందని పెట్టుబడిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ టారిఫ్ విధింపు అన్నీ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇండియాపై 26శాతం, చైనాపై 34% టారిఫ్ విధించింది. దీంతో అమెరికా మార్కెట్లో చైనా వస్తువులకంటే భారతీయ వస్తువులకే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. దీనికి అమెరికా, ఇండియాల ఫ్రెండ్షిపే కారణం.
అమెరికా భారత్పై 26 శాతం ప్రతీకార సుంకం విధించించిన సంగతి తెలిసిందే. దీనిపై విపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం ఈ టారిఫ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ఈ సుంకాలు మన ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తాయన్నారు.
ట్రంప్ అనేక దేశాలపై తాజాగా ప్రతీకార సుంకాలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఆయన సుంకాల ప్రకటన నుంచి కొన్ని దేశాలు తప్పించుకోగలిగాయి. అయితే ఆ దేశాల్లో ముందుగా రష్యా, కెనడా, ఉత్తర కొరియాలు ఉన్నాయి.
ట్రంప్ టారిఫ్ ప్రకటన పై పలు దేశాధినేతలు తీవ్రంగా స్పందించారు. నిజమైన స్నేహితుడు అయితే ఇలాంటి పని చేయడని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ పేర్కొన్నారు.ఈ సుంకాలు ఊహించనివి కావు. కానీ అవి పూర్తిగా అసంబద్ధమైనవని అన్నారు.
ట్రంప్ ప్రతీకార సుంకాల వల్ల ప్రపంచ మార్కెట్లు కుదేలు పడుతున్నాయి. జపాన్ నిక్కీ 3.4 శాతం పడిపోగా దక్షిణ కొరియా మార్కెట్లు 1.9 శాతం కుంగాయి. ట్రంప్ ప్రకటన తర్వాత అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా కుదేలు పడ్డాయి. బంగారం ధర కూడా పరిగెడుతోంది.