ఇండియాకు సపోర్ట్‌గా పాకిస్తాన్ మంత్రి.. ‘ట్రంప్ చెప్పింది అబద్ధం’

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తానే కీలక పాత్ర పోషించానని డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పరోక్షంగా తోసిపుచ్చారు. శాంతి చర్చల్లో మూడవ పక్షం జోక్యాన్ని భారత్ తిరస్కరించిందని ఆయన స్పష్టం చేశారు.

New Update
Pakistan's Foreign Minister Ishaq Dar has once again issued a threat

Pakistan's Foreign Minister Ishaq Dar has once again issued a threat

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో తానే కీలక పాత్ర పోషించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనలను పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ పరోక్షంగా తోసిపుచ్చారు. శాంతి చర్చల్లో మూడవ పక్షం జోక్యాన్ని భారత్ తిరస్కరించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు, ట్రంప్ తరచుగా చేస్తున్న ప్రకటనల డొల్లతనాన్ని బయటపెట్టాయి.

అల్ జజీరా మీడియా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దార్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్-పాక్ సంబంధాలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి, మధ్యవర్తిత్వం కోసం భారత్‌తో ఏమైనా సంప్రదింపులు జరిగాయా అని అడిగిన ప్రశ్నకు ఆయన బట్టిచారు. "మూడవ పక్షం జోక్యాన్ని భారత్ అంగీకరించదు. ఇది వారి అంతర్గత వ్యవహారంగా వారు భావిస్తారు," అని దార్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా, ట్రంప్ వాదనలకు పాకిస్తాన్ కూడా మద్దతు పలకడం లేదని స్పష్టమైంది.

ట్రంప్ పదేపదే అదే పాట
గత కొంతకాలంగా, ట్రంప్ భారత్-పాక్ మధ్య శాంతిని నెలకొల్పడంలో, ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో తన పాత్ర ఉందని పదేపదే చెప్పుకుంటున్నారు. ఆయన ఈ ఒప్పందం తన "వ్యాపార ఒత్తిడి" వల్లే సాధ్యమైందని, లేకపోతే యుద్ధం జరిగేదని వాదిస్తున్నారు.

భారత్ పదే పదే తిరస్కరణ
అయితే, భారత్ ఈ వాదనలను మొదటి నుంచీ గట్టిగా ఖండిస్తూ వస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా పార్లమెంటులో మాట్లాడుతూ, ఈ కాల్పుల విరమణ ఒప్పందం కేవలం ఇరు దేశాల మిలిటరీ డైరెక్టర్ జనరల్స్ (డిజిఎంఓలు) మధ్య జరిగిన చర్చల ద్వారానే సాధ్యమైందని స్పష్టం చేశారు. భారత్ తన వ్యవహారాల్లో మూడవ పక్షం జోక్యాన్ని ఎన్నటికీ అంగీకరించబోదని ఆయన నొక్కి చెప్పారు.

పాకిస్తాన్ మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు, భారత్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో వచ్చాయి. రష్యా నుండి చమురు కొనుగోలుపై భారత్‌పై అమెరికా అదనపు సుంకాలు విధించడం వంటి చర్యలు ఈ సంబంధాలకు కొంత ఇబ్బంది కలిగించాయి. అయితే, భవిష్యత్తులో కూడా భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానానికే కట్టుబడి ఉంటుందని, దానిని అమెరికా లేదా మరే ఇతర దేశం కూడా ప్రభావితం చేయలేదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు