బిడ్డను కంటే 5 వేల డాలర్లు | 5 thousand dollars for a child | Trump New announcement | RTV
ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల జల్లు కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని, వ్యక్తిగతంగానూ ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందని వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాల నుంచి వసూలు చేయనున్న టారిఫ్ లపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.దేశానికి ఈ సొమ్ము లభిస్తే ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఆదాయపు పన్ను అవసరం ఇక ఉండబోదని అభిప్రాయపడ్డారు.
సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు. దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.
అమెరికా , చైనా మధ్య ట్రేడ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఇది భారత్కు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చైనా తమ ఎగుమతులను అమెరికాకు కాకుండా ఎక్కువగా భారత్కు పంపించే ఛాన్స్ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
చైనాపై విధిస్తున్న సుంకాలను అమెరికా 145 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా.. అమెరికాపై ఉన్న 84 శాతం టారిఫ్ను 125కి పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. దీనివల్ల ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చుట్టూ ఇప్పుడు కొత్త వివాదం నెలకొంది. అదే ఇన్ సైడర్ ట్రేడింగ్. 90 రోజుల టారీఫ్ విరామాన్ని ప్రకటించే ముందు ఆయన తన ట్రూత్ సోషల్ మీడియాలో కొనగోళ్ళకు ఇది గొప్ప సమయం..డీజేటీ అని చేసిన పోస్టే దీనికి కారణం.
సుంకాలకు బ్రేక్ ఇస్తున్నామని అధ్యక్షుడు ట్రంప్ చెప్పడంతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఈరోజు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అమెరికాలో కూడా మార్కెట్లు రికార్డ్ స్థాయిలో లాభపడ్డాయి. మహావీర్ జయంతి కారణంగా భారత స్టాక్ మార్కెట్లకు సెలవు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో చైనాకు ఊపిరి ఆడడం లేదు. చైనా కూడా ఈ యుద్ధంలో తగ్గడం లేదు కానీ.. మిగతా దేశాల సపోర్ట్ కావాలని మాత్రం అనుకుంటోంది. భారత్ సహా పొరుగు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని అధ్యక్షుడు జిన్పింగ్ అన్నారు.