AP: పక్కా ప్లాన్..కంటెయినర్ లో 225 ల్యాప్ టాప్ లు దొంగతనం
బాపట్ల జిల్లాల కొరిశపాడు మండలం మేదరమెట్ల దగ్గర పెద్ద దొంగతనం జరిగింది. పక్కాప్లాన్ ప్రకారం రవాణా అవుతున్న ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. ఏకంగా 225 ల్యాప్ టాప్ లను కొట్టేశారు.
బాపట్ల జిల్లాల కొరిశపాడు మండలం మేదరమెట్ల దగ్గర పెద్ద దొంగతనం జరిగింది. పక్కాప్లాన్ ప్రకారం రవాణా అవుతున్న ల్యాప్ టాప్ లను చోరీ చేశారు. ఏకంగా 225 ల్యాప్ టాప్ లను కొట్టేశారు.
ఒకటి కాదు రెండు కాదు 20 ఏండ్లుగా లగ్జరీ కార్లే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడడమే కాకుండా సుమారు 150 కార్లను దొంగిలించిన ఘరానా నేరస్తుడిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని రాజస్థాన్ కు చెందిన సత్యేంద్రసింగ్ షెకావత్ గా గుర్తించారు.
సూర్యపేట జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగరంలో ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో జరిగిన దొంగతనంలో 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమెరికాలో దాడి, దొంగతనం లేదా దోపిడీకి పాల్పడితే కఠినమైన శిక్షలతో పాటూ వీసాను రద్దు చేస్తామని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. ఇల్లినాయిస్ లోని టార్గెట్ స్టోర్లో ఒక భారతీయ మహిళ దొంగతనం పట్టుబడిన తర్వాత ఈ హెచ్చరికను జారీ చేసింది.
హైదరాబాద్లోని జీడిమెట్ల ప్రాంతంలో దొంగల గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. కేవలం ఒకే గంట వ్యవధిలో మూడు వేర్వేరు ATMలలో చోరీలకు పాల్పడి స్థానికుల్లో భయాన్ని కలిగించారు. మార్కండేయనగర్లోని హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల ATM కేంద్రాలో చోరీ చేశారు.
ఏపీ లోని చిత్తూరు రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం అర్థరాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ట్రైన్ ఆపి మరీ దొంగలు విరుచుకుపడ్డారు. బెంగళూరు వైపు వెళ్తున్న చామరాజు నగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 16219లో విద్యుత్తు సరఫరా ఆపేసి అందినకాడికి దోచుకున్నారు.
ఒక కిరాణ షాపు యజమానిని పిస్టల్తో బెదరించి డబ్బులు దోచుకున్న సంఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 71 వేల 150 రూపాయలతో పాటుగా ఒక బొమ్మ పిస్టల్, 4 సెల్ ఫోన్స్ 4 సెల్ ఫోన్స్, రెండు యాక్టివా బైక్స్ లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ బేగంపేట పరిధిలోని సన్ స్టీల్ దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణంలోని లాకర్లో ఉన్న రూ.48లక్షలు ఎత్తుకెళ్లారని యజమాని గిరీశ్జైన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చందానగర్లోని హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో ఓ దొంగ చోరీకి యత్నించాడు. తలకిందులయ్యేలా శ్రమించినా.. మిషన్ ఓపెన్ కాలేదు. దీంతో శరీరం అలసిపోనట్లు అక్కడే నేలపై పడుకొని నిద్రపోయాడు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో నమోదవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.