Theft: సూర్యపేటలో భారీ చోరీ.. 18 కిలోల బంగారం మాయం
సూర్యపేట జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగరంలో ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో జరిగిన దొంగతనంలో 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సూర్యపేట జిల్లాలోని ఓ నగల దుకాణంలో భారీ చోరీ జరిగింది. నగరంలో ఉన్న సాయి సంతోషి నగల దుకాణంలో జరిగిన దొంగతనంలో 18 కిలోల బంగారం, రూ.22 లక్షల నగదు చోరీ జరిగినట్లు షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అమెరికాలో దాడి, దొంగతనం లేదా దోపిడీకి పాల్పడితే కఠినమైన శిక్షలతో పాటూ వీసాను రద్దు చేస్తామని యూఎస్ ఎంబసీ హెచ్చరించింది. ఇల్లినాయిస్ లోని టార్గెట్ స్టోర్లో ఒక భారతీయ మహిళ దొంగతనం పట్టుబడిన తర్వాత ఈ హెచ్చరికను జారీ చేసింది.
హైదరాబాద్లోని జీడిమెట్ల ప్రాంతంలో దొంగల గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. కేవలం ఒకే గంట వ్యవధిలో మూడు వేర్వేరు ATMలలో చోరీలకు పాల్పడి స్థానికుల్లో భయాన్ని కలిగించారు. మార్కండేయనగర్లోని హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకుల ATM కేంద్రాలో చోరీ చేశారు.
ఏపీ లోని చిత్తూరు రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం అర్థరాత్రి దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ట్రైన్ ఆపి మరీ దొంగలు విరుచుకుపడ్డారు. బెంగళూరు వైపు వెళ్తున్న చామరాజు నగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్ 16219లో విద్యుత్తు సరఫరా ఆపేసి అందినకాడికి దోచుకున్నారు.
ఒక కిరాణ షాపు యజమానిని పిస్టల్తో బెదరించి డబ్బులు దోచుకున్న సంఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 71 వేల 150 రూపాయలతో పాటుగా ఒక బొమ్మ పిస్టల్, 4 సెల్ ఫోన్స్ 4 సెల్ ఫోన్స్, రెండు యాక్టివా బైక్స్ లను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ బేగంపేట పరిధిలోని సన్ స్టీల్ దుకాణంలో భారీ చోరీ జరిగింది. దుకాణంలోని లాకర్లో ఉన్న రూ.48లక్షలు ఎత్తుకెళ్లారని యజమాని గిరీశ్జైన్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చందానగర్లోని హెచ్డీఎఫ్సీ ఏటీఎంలో ఓ దొంగ చోరీకి యత్నించాడు. తలకిందులయ్యేలా శ్రమించినా.. మిషన్ ఓపెన్ కాలేదు. దీంతో శరీరం అలసిపోనట్లు అక్కడే నేలపై పడుకొని నిద్రపోయాడు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో నమోదవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో 1.5 టన్నుల పేలుడు పదార్థాలతో వెళ్తున్న ట్రక్కును నక్సల్స్ బృందం దోచుకుంది. దీంతో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పోలీసులు మరియు పారామిలిటరీ దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.
తెలంగాణ రాజ్భవన్లో దొంగలుపడ్డారు. సుధర్మభవన్లో మే 14న కీలకమైన రిపోర్టులు, ఫైల్స్, 4 హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లారు. రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా CC ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.