Odisha: 1.5 టన్నుల పేలుడు పదార్ధాలను దొంగిలించిన నక్సల్స్..హై అలెర్ట్ లో పోలీసులు
ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో 1.5 టన్నుల పేలుడు పదార్థాలతో వెళ్తున్న ట్రక్కును నక్సల్స్ బృందం దోచుకుంది. దీంతో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పోలీసులు మరియు పారామిలిటరీ దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి.