Texas : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి!
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అన్నాలోని రోడ్డు నెంబర్ 75లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు భారతీయులు మృతి చెందారు. వారిలో ముగ్గురు హైదరాబాద్ వాసులు ఉన్నారు.హైదరాబాద్ కు చెందిన ఆర్యన్ రఘునాథ్, ఫరూఖ్, లోకేశ్ పాలచర్ల ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.