Rain Alert To Telugu States | రేపటి నుంచి వానలే వానలు | IMD Report | Monsoon Rains | AP & Telangana
తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థగా యునైటెడ్ ఫూలే ఫ్రంట్ పని చేస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం యూపీఎఫ్ నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూపీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు.
జూబ్లీహిల్స్లో తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ను కవిత నేడు ప్రారంభించారు. BRS, జాగృతి KCRకు 2 కళ్లని అన్నారు. పార్టీతో సంబంధం లేకుండా ప్రజల కోసం పోరాడేందుకు ఆమె రూట్మ్యాప్ తయారు చేసుకున్నారు. BCల కోసం రైల్రోకో, KCRకు నోటీసులపై ధర్నాకు సిద్ధమైయ్యారామె.
పాక్తో జరిగిన యుద్ధంలో రాఫెల్ యుద్ధ విమానాలు కూలాయా అనే ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ అన్నారు. రాఫెల్ యుద్ధ విమానం కూలినట్లు సీడీఎస్ అనిల్ చౌహన్ చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రం వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.
BRS ఎమ్మెల్సీ కవిత శనివారం జూబ్లీహిల్స్లో తెలంగాణ జాగృతి కొత్త ఆఫీస్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్కు BRS, జాగృతి రెండు కళ్ల లాంటివని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో 18ఏళ్లగా ఈ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేసిందన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈరోజు సాయంత్రం తన ఇంటికి సమీపంలోనే జాగృతి కొత్త ఆఫీస్ను ఈ కార్యాలయాన్ని ఓపెనింగ్ చేయనున్నారు. రెండంతస్తుల్లో ఉన్న ఆ బిల్డింగ్ ఎంట్రన్స్లో కేసీఆర్ ఫొటో ఉంది.అలాగే ప్రొ. జయశంకర్, తెలంగాణ తల్లి, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి.
కవిత వ్యవహారం అంతా ఓ ఫ్యామిలీ డ్రామా అని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఎప్పుడూ కలవవని అన్నారు. కవిత అరెస్టు అవ్వకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసేందుకు యత్నించిందని తెలిపారు.
KCR పార్టీ పగ్గాలు ట్రబుల్ షూటర్ హరీశ్ రావుకు అప్పగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కవిత ఇష్యూ BRSలో సంచలనంగా మారింది. కవిత, కేటీఆర్ల మధ్య విభేదాలు హరీశ్ తగ్గించేందుకు ట్రై చేస్తున్నారు. ఫాంహౌస్లో KCRతో వారం రోజుల్లో 4సార్లు హరీష్ భేటీ అయ్యారు.