Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
తెలంగాణలోని మెదక్లో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ జంట తమ ఇద్దరు పిల్లలను కోర్టు బిల్డింగ్ పై నుంచి కిందికి తోసి.. ఆపై వారు ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భార్య అక్కడిక్కడే మృతి చెందింది. ఇద్దరు పిల్లలు, భర్త తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేరారు.