Maha Kumbh Stampede | ఢిల్లీ రైల్వే స్టేషన్ లో తొక్కిసలాట | Delhi Railway Station | RTV
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట 18 మంది ప్రాణాలు బలిగొంది. ఇందులో 11 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. ప్రయాగ్ రాజ్ వెళ్ళాల్సిన రైళ్లు రద్దయ్యాయనే పుకారు చెలరేగడమే తొక్కిసలాటకు కారణం అని అంటున్నారు.
ఢిల్లీ రైల్వే స్టేషన్లో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది మృతి చెందారు. 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 10 మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు.
న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట జరిగింది. 13, 14 ప్లాట్ ఫామ్ లపై రైళ్ళు ఎక్కేందుకు ఒకేసారి భారీ సంఖ్యలో ప్రయాణికులు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 15 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది.
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా తొక్కిసలాట ఘటన పార్లమెంట్ను కుదిపేసింది. తొక్కిసలాట ఘటనపై లోక్సభలో విపక్ష నేతలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. సోమవారం ఉదయం బడ్జెట్ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాక తొక్కిసలాటపై ప్రభుత్వాన్ని నిలదీశాయి.
కుంభమేళా తొక్కిసలాట ఘటనలో 30 మంది మృతి చెందినట్లు యూపీ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసింది. అర్ధరాత్రి 1 -2 గంటల మధ్య ఈ తొక్కిసలాట చోటుచేసుకున్నట్లు డీఐజీ వైభవ్ కృష్ణ తెలిపారు. మృతుల్లో 25 మందిని గుర్తించామని.. మరో ఐదుగురిని గుర్తిస్తున్నామన్నారు.
కుంభమేళా తొక్కిసలాటకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మౌని అమవాస్య కావడం వల్ల భక్తులు త్వరగా స్నానాలు చేసి వెళ్లిపోవాలని సూచించారు. అయినప్పటికీ భక్తులు మాట వినకపోవడం, రద్దీ పెరగడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
ఉత్తర్ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ వద్ద మంగళవారం రాత్రి 2 గంటల సమయంలో త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈఘటనలో 17 మంది భక్తులు మరణించారు. ఈ క్రమంలో సీఎం యోగి భక్తులను ఉద్దేశించి ఓ కీలక ప్రకటన చేశారు.
ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో 17 మంది మృతి చెందగా, మరో 40 మందికి పైగా గాయపడ్డారు. దీంతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించింది.