Goa Stampede: గోవాలో ఘోర విషాదం.. తొక్కిసలాటలో ఏడుగురు మృతి

గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీగావ్లోని శ్రీదేవి లయ్‌రయీ ఆలయంలో జాతర జరుగుతుండగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందగా 30 మందికి పైగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది.

New Update
Goa stampede

గోవాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. శ్రీగావ్‌లోని శ్రీదేవి లైరాయ్ ఆలయంలో జాతర సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలైయ్యాయి. పోలీసులు, అధికారులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను గోవా మెడికల్ కాలేజీ (జిఎంసి), మపుసాలోని ఉత్తర గోవా జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉత్తర గోవా ఎస్పీ అక్షత్ కౌశల్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తెల్లవారు జామున భక్తుల రద్దీ

ఉత్తర గోవా జిల్లాలోని లైరాయ్ దేవి ఆలయంలో శుక్రవారం వైభవంగా జాతర మొదలైంది. జాతర కోసం వేలాది మంది భక్తులు తరలివచ్చారు. శనివారం తెల్లవారు జామున భక్తుల రద్దీ పెరగడంతో తొక్కిసలాట జరిగింది.

Also read: Bull Riding Scooty: అలా ఎలా ఎక్కిందమ్మా.. స్కూటీ నడిపిన ఎద్దు (VIDEO) వైరల్

 

1,000 మంది పోలీసు సిబ్బంది

భక్తుల భద్రత కోసం దాదాపు 1,000 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. జన కదలికలపై నిఘా కోసం డ్రోన్‌లను కూడా ఏర్పాటు చేశారు. జాతర ప్రారంభానికి ముందుగానే ముఖ్యమంత్రి సావంత్, ఆయన భార్య సులక్షణ, రాజ్యసభ ఎంపీ సదానంద్ షెట్ తనవాడే, ఎమ్మెల్యేలు ప్రేమేంద్ర షెట్ , కార్లోస్ జాతరను సందర్శించారు.

Also read: లవర్‌తో ఆ పని చేస్తూ తల్లిదండ్రులకు పట్టుబడ్డ కన్నకొడుకు.. పాపం అందరి ముందు(VIRAL VIDEO)


(stampede | goa | goa trip | goa places | temple | devotees | latest-telugu-news)

 

Advertisment
Advertisment
తాజా కథనాలు