/rtv/media/media_files/2025/06/04/DAuZOpf8fPmnuTJcxhVE.jpg)
Bengaluru stampede
చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి, 52 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 18 ఏళ్ల తరువాత ఆర్సీబీ కప్ గెలవడంతో భారీ సంఖ్యలో అభిమానులు చిన్నస్వామి స్టేడియానికి వచ్చారు. స్టేడియం సామర్థ్యం కన్నా ఎక్కువ మంది జనాలు రావడం వల్లనే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. గాయపడిన వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక బాలుడు కూడా ఉన్నారు.
అయితే చిన్నస్వామి స్టేడియం గేట్ దగ్గర ఉన్న పైకప్పు కూలడంతో తొక్కిసలాట జరిగిందని కొందరు చెబుతున్నారు. మరికొందరు బారికేడ్లను జనాలు తోసేయడం వల్లనే ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక్కసారిగా అభిమానులు స్టేడియంలోకి దూసుకువచ్చారు. వారిని పోలీసులు అదుపు చేయలేకపోయారు. లాఠీ ఛార్జి కూడా చేయవలసి వచ్చింది. దాంతో పాటూ తొక్కిసలాట మొదలైన తర్వాత జనాలు పానిక్ అయిపోయారు. పడిపోయిన వారిని రక్షించడానికి కూడా అందరూ ఒకేసారి రావడంతో మరింత తొక్కిసలాటకు కారణం అయిందని చెబుతున్నారు.
తొక్కిసలాట జరిగిన సమయం..
ఆర్సీబీ జట్టు మధ్యాహ్నం 3 గంటల 49 నిమిషాలకు బెంగళూరుకు చేరింది. సాయంత్రం 4:47 గంటలకు విధాన సభ ప్రాంగణానికి ఆర్సీబీ వెళ్లింది. అక్కడ 5:10కి భారీ వర్షంలోనే టీమ్కు సత్కారం కొనసాగింది. దీనికి భారీ జనాలు తరలివచ్చారు. సంటేడియంలోకి దూసుకెళ్ళడానికి ప్రయత్నించారు. దాంతో 5:16 గంటలకి చిన్నస్వామి స్టేడియం దగ్గర లాఠీచార్జ్ జరిగింది.ఆ తరువాత 5:16 నిమిషాలకు అభిమానులు భారీ కేడ్లు దూకడంతో తొక్కిసలాట ప్రారంభమైంది. 5:30 గంటలకి ఘటనపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఆరా తీశారు. 5:47కి స్టేడియం వద్దకు ఆంబులెన్స్ చేరుకున్నాయి. సాయంత్రం 5:50 గంటలకి ఎనిమిది మంది చనిపోయినట్లు ప్రకటన వచ్చింది. 5:53 నిమిషాలకు బెంగళూరు పోలీసులు ఏమీ చేయలేమని చెప్పేశారు. సాయంత్రం 6:01 గంటలకి 11 మంది చనిపోయినట్లు ప్రకటన విడుదల చేశారు.