Karnataka stampede: ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాట ఎఫెక్ట్.. కర్ణాటకలో కొత్త చట్టం

ఆర్సీబీ పరేడ్ తొక్కిసలాట వంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతుంది. కర్ణాటక జన సమూహ నియంత్రణ బిల్లు- 2025 అనే కొత్త చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించనున్నారు.

New Update
Siddaramaiah calls pro-Pakistan slogan

Siddaramaiah

18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌ను చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించారు. ఇక్కడ తొక్కిసలాట జరిగి 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక జన సమూహ నియంత్రణ బిల్లు- 2025 అనే కొత్త చట్టాన్ని తీసుకురాబోతోంది.

ఇది కూడా చూడండి: IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!

ఇది కూడా చూడండి: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?

కేబినెట్ మీటింగ్‌లో నిర్ణయం..

జూన్ 19న జరిగిన కేబినెట్ సమావేశంలో సిద్దరామయ్య సర్కార్ ఈ ముసాయిదా బిల్లుపై చర్చించింది. ఈ బిల్లు ప్రకారం కర్ణాటకలో రాజకీయ ర్యాలీలు, సమావేశాలు  ప్రాయోజిత కార్యక్రమాలు, సామూహిక సమావేశాలలో తొక్కిసలాంటి ఘటనలకు తప్పనిసరిగా అనుమతి ఉండాలి. అలాగే ఎవరైనా జన సమూహాన్ని నియంత్రించడంలో విఫలం అయితే తప్పకుండా పరిహారం విషయంలో వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

ఇది కూడా చూడండి: Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించనున్నారు. అయితే ఈ బిల్లు జాతరలు, రథోత్సవాలు, పల్లకీ ఊరేగింపులు, పడవల పండుగలు, ఉర్స్ కార్యక్రమాలు, ఇతర మతపరమైన వేడుకలు వంటి సాంప్రదాయ, మతపరమైన సమావేశాలకు మినహాయింపు ఇస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు