Jagannath's Chariot: జగన్నాథుడి రథయాత్రలో తొక్కిసలాట
గుజరాత్లోని గోల్వాడ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపులో ఏనుగు ఒక్కసారిగా భక్తులపైకి దూసుకెళ్లింది. భక్తులు భయంతో పరుగులు తీయడం కారణంగా తొక్కిసలాట జరిగింది. పలువురు భక్తులకు గాయాలు అయ్యాయి. వెంటనే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.