విజయ్ ఇంటి ముందు భారీ భద్రత.. ఏ క్షణమైనా ఉద్రిక్తత!
తమిళనాడు ప్రభుత్వం TVK పార్టీ అధినేత విజయ్ ఇంటికి భారీగా భద్రత పెంచింది. కరూర్ సభలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రజలు కోపంతో ఉన్నారు. ఏ క్షణమైనా విజయ్ నివాసం వద్ద ఆందోళనకు దిగవచ్చని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.