/rtv/media/media_files/2025/07/27/haridwar-2025-07-27-10-29-41.jpg)
Stampede At Manasa Devi Temple
హరిద్వార్లోని ప్రసిద్ధ మానసా దేవి ఆలయం దగ్గర దురదృష్టకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఉదయం ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో గుడి దగ్గర తోపులాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు భక్తులు మృతి చెందారు. చాలా మంది భక్తులు గాయపడి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, స్థానిక పోలీసులు, పరిపాలనా బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు నిర్వహిస్తున్నారు.
Also Read : ఆడుకుంటుండగా బిందెలో ఇరుక్కున్న చిన్నారి తల....ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Uttarakhand | 6 people dead in a stampede after a huge crowd gathered at the Mansa Devi temple in Haridwar. I am leaving for the spot. A detailed report of the incident is awaited: Garhwal Division Commissioner Vinay Shankar Pandey to ANI pic.twitter.com/nTLNf6DG9j
— ANI (@ANI) July 27, 2025
#WATCH | Haridwar, Uttarakhand | The injured are being rushed to the hospital following a stampede at the Mansa Devi temple. 6 people died and several others got injured in the stampede. pic.twitter.com/ScUaYyq2Z3
— ANI (@ANI) July 27, 2025
Also Read : తెలంగాణలో దారుణం.. పాఠశాలలో ఫుడ్పాయిజన్తో 65 మంది విద్యార్థులు..!
Also Read : ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. పామునే కొరికి చంపేశాడు
గుడి మెట్లలో కరెంట్..
ప్రాథమిక సమాచారం ప్రకారం మానసాదేవి ఆలయం మెట్ల మీద ఈ ఘటన జరిగింది. మెట్లలో విద్యుత్ ప్రవాహం ఉందని అనుమానిస్తున్నారు. దానివలనే భక్తుల్లో తొక్కిసలాట జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని గర్హ్వాల్ డీసీ వినయ్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాదంలో దాదాపు 15 మంది గాయపడ్డారని చెప్పారు. మరోవైపు తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. తాను స్థానిక పరిపాలనతో దీని గురించి మాట్లాడుతున్నానని..పరిస్థితిని సమీక్షిస్తున్నామని తెలిపారు.
today-latest-news-in-telugu