🔴 Live Breakings: ప్రణయ్ హత్య కేసులో నిందితుడికి ఉరి శిక్ష
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
మధ్యప్రదేశ్లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
ముంబై కుర్లా ప్రాంతానికి చెందిన రూబీ అనే మహిళకు రెస్టారెంట్ లో బిర్యానీ తింటున్న సమయంలో ఎముక గొంతులో ఇరుక్కుంది. దాని వల్ల ఆమె 21 రోజుల పాటు అవస్థలు పడగా...8 లక్షలు ఖర్చు పెట్టి బయటకు తీయాల్సి వచ్చింది.
రెండు దశాబ్దాలుగా పరారీలో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్తో సంబంధం ఉన్న ఉగ్రవాదిని ఉత్తర్ ప్రదేశ్ ఉగ్రవాది నిరోధక దళం రెస్ట్ చేసింది. ఉల్ఫత్ హుస్సేన్ ని మొరాదాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
వైరల్ | స్పోర్ట్స్ | ఇంటర్నేషనల్ | నేషనల్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | క్రైం
సీఎం స్టాలిన్ ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ విధానానికి వ్యతిరేకంగా ''జాయింట్ యాక్షన్ కమిటీ'' ఏర్పాటు చేద్దామని పిలుపునిచ్చారు. మార్చి 22న చెన్నైలో జరగనున్న జేఏసీ సమావేశానికి హాజరుకావాలని కోరారు.
ముంబైలో భార్య వేధింపులకు మరో భర్త బలయ్యాడు. అత్తతో కలిసి కట్టుకున్న ఆవిడ టార్చర్ చేయడంతో సామాజిక కార్యకర్త త్రిపాఠి బాత్ రూమ్లో ఉరేసుకుని చనిపోయాడు. ఫిబ్రవరి 28న ఈ ఘటన జరగగా కంపెనీ వెబ్సైట్లో సూసైడ్ నోట్ ద్వారా హృదయవిదారకర ఘటన వెలుగులోకి వచ్చింది.
డీఎంకేకు చెందిన ఓ కౌన్సిలర్ రెచ్చిపోయాడు. ఇటీవల ఆ పార్టీ కార్యకర్తలతో హిందీ వ్యతిరేక ప్రతిజ్ఞలు చేయించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కౌన్సిలర్ జాకీర్ హుసేన్ ఒళ్లు మరిచి ప్రవర్తించాడు. సుశీల అనే ఓ మహిళా కార్యకర్త చేతికున్న గాజును లాగేందుకు ప్రయత్నించాడు.
కుంభమేళా జరిగినప్పుడు పడవలు నడిపించి ఒక కుటంబం రూ.30 కోట్లు ఆర్జించిందని యోగి ఆదిత్య నాథ్ తెలిపారు. కుంబమేళా నిర్వహణపై ప్రతిపక్షాల చేసిన విమర్శలకు బుధులుగా ఈ విషయాన్ని చెప్పారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి.