Telangana: తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
తెలంగాణలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం మద్యం కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇప్పటివరకు 92 మద్యం సరఫరా కంపెనీలు 604 కొత్త బ్రాండ్లకు అనుమతి కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్నాయి.
తెలంగాణలో కొత్త బ్రాండ్ల అమ్మకాల అనుమతుల కోసం మద్యం కంపెనీలు ఎగబడుతున్నాయి. ఇప్పటివరకు 92 మద్యం సరఫరా కంపెనీలు 604 కొత్త బ్రాండ్లకు అనుమతి కోరుతూ దరఖాస్తులు పెట్టుకున్నాయి.
తెలంగాణలో ఇన్స్టంట్ బీర్ కేఫ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్స్టంట్ కేఫ్లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా మందుబాబుల గ్లాసులోకి రాబోతుంది.
మద్య నిషేద చట్టం అమలులో ఉన్న గుజరాత్లో భారీగా అక్రమ సరుకు పట్టబడింది. రూ. 2 కోట్లకుపైగా విలువైన ఫారిన్ మందును స్వాధీనం చేసుకున్న పోలీసులు రోడ్ రోలర్తో తొక్కించారు. ఇలాంటి చర్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది.
కర్ణాటక అసెంబ్లీలో ఓ వింత ప్రతిపాదన వచ్చింది. సీనియర్ జేడీఎస్ ఎమ్మెల్యే ఎంటీ కృష్ణప్ప మాట్లాడుతూ పురుషులకు వారానికి రెండు బాటిళ్లు ఉచిత మద్యం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
తెలంగాణలోని మందుబాబులకు కిక్కెక్కించే వార్త వినిపించనుంది ఎక్సైజ్ శాఖ.37 కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో 15 విదేశీ బ్రాండ్లు కాదు.. మరో 15 దేశీయ బ్రాండ్లుగా తెలుస్తోంది. ఇక మిగిలినవి కొత్త బీర్ల బ్రాండ్లుగా సమాచారం.
ఏపీలో మద్యం డోర్ డెలివరీ చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరు ఏజెన్సీ ప్రాంతంలో చిన్న వ్యాన్లో మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. పోలీసులు కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
తిరుపతి రూరల్ దామినేడు ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ (సెబ్) అధికారులు దాడులు నిర్వహించి నకిలీ మద్యం తయారు చేస్తున్న మెటీరియల్ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల అన్నమయ్య జిల్లా కోడూరు లో పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబడింది.
సంక్రాంతి మూడు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది.పండుగ రోజుల్లోనే ఏకంగా రూ.400 కోట్ల విలువైన మద్యం తాగేసినట్లు అధికారులు అంటున్నారు. ఇక చివరి రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు సమాచారం.
తెలంగాణలో మందుబాబులకు త్వరలోనే షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచేందుకు సర్కార్ రంగం సిద్దం చేస్తోంది.6 నెలల క్రితం ఏర్పాటు చేసిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి నిర్ణయించనుంది.