/rtv/media/media_files/2025/07/13/liquor-bottles-in-jharkhand-2025-07-13-19-50-51.jpg)
Jharkhand liquor bottles scam
జార్ఖండ్లో మద్యం వ్యాపారులు లక్షలు విలువ చేసే లిక్కర్ను మాయం చేశారు. ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. లిక్కర్ ఏమైందని ప్రశ్నించిన అధికారులకు మద్యం వ్యాపారులు వింత సమాధానం చెప్పారు. 800 బాటిళ్ల లిక్కర్ ఎలుకలు తాగాయని వారు సమాధానం చెప్పారు. దీంతో ఎక్సైజ్ అధికారులు కంగు తిన్నారు. జార్ఖండ్లో ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీని అమల్లోకి తీసుకురానున్నారు. నూతన మద్యం పాలసీలో భాగంగా లిక్కర్ బిజినెస్ ప్రైవేట్ లైసెన్స్దారులకు బదిలీ చేయనున్నారు. ప్రభుత్వంపై భారాన్ని తగ్గించడం కోసం, వ్యాపారంలో పారదర్శకత కోసం నూతన పాలసీని తీసుకొస్తున్నట్లు జార్ఖండ్ సర్కారు తెలిపింది.
🚨 आपको यकीन नहीं होगा... लेकिन ये सच है!
— Afshar Ali khan (@DastanAfsharAli) July 13, 2025
झारखंड में ऐसा मामला सामने आया है जिस पर यकीन करना मुश्किल है।
धनबाद में 800 बोतल शराब गायब मिली!
सरकारी जांच हुई तो व्यापारियों ने जो वजह बताई वो सुनकर आप हैरान रह जाओगे
"साहब, चूहे पी गए शराब!" 🐀🍾
हां, आपने सही पढ़ा...
चूहे ढक्कन… pic.twitter.com/PVTNtmUBko
నూతన మద్యం పాలసీ నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లిక్కర్ స్టాక్ లెక్కలు తేల్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు మద్యం స్టాక్ లెక్కలు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ధన్బాద్ ఏరియాలో మద్యం స్టాక్ను తనిఖీ చేసేందుకు వెళ్లారు. అక్కడ ఏకంగా 800 సీసాల ఇండియా మేడ్ విదేశీ మద్యం మాయమైంది. దీనిపై ధన్బాద్ మద్యం వ్యాపారులను వివరణ కోరగా.. లెక్కరాకుండాపోయిన 800 సీసాల మద్యాన్ని ఎలుకలు తాగాయని చెప్పారు. మద్యం సీసాల మూతలను కొరికేసి నేలపాలు చేశాయని ఆరోపించారు. దాంతో అధికారులు షాకయ్యారు. మిస్సయిన స్టాక్ విలువకు సమానంగా ప్రభుత్వానికి పరిహారం చెల్లించాలని నోటీసులు ఇచ్చారు.