New Liquor Policy:  మద్యం పాలసీ ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు..

 రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ప్రధాన వనరుగా ఉన్న మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం ఈ రోజు (సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు వాటిని ప్రారంభించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లూ చేసుకున్నారు.

author-image
By Madhukar Vydhyula
New Update
wine shops

New Liquor Policy

New Liquor Policy:  రాష్ట్ర ప్రభుత్వానికి అతిపెద్ద ప్రధాన వనరుగా ఉన్న మద్యం అమ్మకాలకు సంబంధించి నూతన విధానం ఈ రోజు (సోమవారం) నుంచి అమల్లోకి రానుంది. దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులు వాటిని ప్రారంభించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లూ చేసుకున్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పాలసీ 2027 నవంబరు వరకూ అమల్లో ఉండనుంది. దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ చెబుతోంది. 2023-25 పాత మద్యం పాలసీ గడువు ఆదివారంతో ముగియగా.. ఈ రెండేళ్లలో మద్యం అమ్మకాలు ఊహించని విధంగా పెరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ తెలిపింది .  దీని ద్వారా రాష్ట్ర ఖజానాకు భారీగా నిధులు సమకూరాయి. గత రెండేళ్లలో 724 లక్షల కేసుల లిక్కర్‌, 960 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈ అమ్మకాల విలువ రూ.71,550 కోట్లుగా తేలింది. పాతపాలసీ ప్రారంభమైన 2023 డిసెంబరులో ఏకంగా రూ.4,297 కోట్ల వ్యాపారం జరిగింది. అనంతరం 2024 జనవరి నుంచి డిసెంబరు వరకు రూ.37,485 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబరు వరకు రూ.29,766 కోట్ల అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. ఈ మొత్తం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయంలో ప్రభుత్వానికి 80 శాతం మేర సమకూరనుంది. దీనికి అదనంగా మద్యం దుకాణాల దరఖాస్తు ఫీజులు, లైసెన్స్‌ ఫీజుల రూపంలో మరింత ఆదాయం వచ్చింది.
 
ఎన్నికలతో పెరిగిన అమ్మకాలు..


కాగా పాత మద్యం పాలసీ సమయంలోనే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు రావడంతో రాష్ర్టంలో  మద్యం అమ్మకాల పెరుగుదలకు దోహదపడింది. ఈసారి ఫీజుల పెంపు, కొత్త పాలసీ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునే దిశగా ఎక్సైజ్‌ శాఖ.. మద్యం పాలసీలో కొన్ని కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా మద్యం దుకాణం లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకునే ఫీజును  రూ.3 లక్షలకు పెంచింది. గతంలో ఇది రూ.2 లక్షలు మాత్రమే ఉండేది. ఈ పెంపు ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీంతోపాటు మద్యం దుకాణదారులు చెల్లించాల్సిన వార్షిక లైసెన్స్‌ ఫీజును కూడా అమ్మకాల స్థాయి ఆధారంగా స్లాబ్‌లుగా విభజించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో దుకాణానికి ప్రతి ఏటా అత్యధికంగా రూ.కోటి 10 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అమ్మకాలను బట్టి రూ.1.10 కోట్లు, రూ.85 లక్షలు, రూ.56 లక్షలు, రూ.55 లక్షలు, రూ50 లక్షల స్లాబ్‌లను నిర్ణయించారు. అయితే లైసెన్స్‌దారులు చెల్లించాల్సిన లైసెన్స్‌ ఫీజులో ఆరో వంతును ఎక్సైజ్‌ శాఖ ఇప్పటికే వసూలు చేయడం గమనార్హం.

కొత్త వ్యాపారులకు  
కాగా కొత్తగా మద్యం షాపుల లైసెన్స్‌ దక్కించుకున్న వ్యాపారులు సోమవారం నుంచి తమ దుకాణాలను కొత్త పాలసీ ప్రకారం ప్రారంభించనున్నారు. కాగా, ఈసారి వ్యాపారులకు కూడా ఈ పరిణామాలు లాభాలార్జించేలా కలిసివచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త పాలసీ కాలంలో గ్రామ పంచాయతీ, పరిషత్‌, మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ ఎన్నికలు జరగనున్నాయి. అంతేకాకుండా త్వరతో జరగబోయే మేడారం జాతర వంటి భారీ ఉత్సవాలు కూడా మద్యం అమ్మకాలు భారీగా పెరగడానికి కారణమవుతాయి. ఇదే జోష్‌తో కొత్త మద్యం వ్యాపారులు రంగంలోకి దిగుతున్నారు. ఈసారి వ్యాపారులు అమ్మకాల పెంపుతో తమ ఆదాయాన్ని ఘననీయంగా పెంచుకోవాలని భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు