Telangana: మందుబాబులకు గుడ్‌న్యూస్.. సమ్మర్‌లో ఫుల్లుగా బీర్లు!

తెలంగాణలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టంట్ కేఫ్‌లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా మందుబాబుల గ్లాసులోకి రాబోతుంది.

New Update
liquor

తెలంగాణలోని మందుబాబులకు నిజంగా ఇది కిక్కిచ్చే వార్తే. హాట్ సమ్మర్‌లో ప్రభుత్వం మందుబాబులకు మత్తెక్కించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.  కోడ్ ముగియగానే అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.నగరంలో ప్రతి 3 కి.మీ ఒకటి, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో ప్రతి 30 కి.మీ ఒకటి చొప్పున ఈ ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అనుకుంటుందంట.

Also Read: TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!

ఇన్‌స్టంట్ కేఫ్‌లో మైక్రో బ్రూవరీ నుంచి అప్పటికప్పుడు తయారై బీరు నేరుగా గ్లాసులోకి వస్తుంది. ప్రస్తుతం విదేశాల్లో ఈ విధానం అందుబాటులో ఉండగా.. తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకుంటుందంట. అదే జరిగితే సమ్మర్‌లో మందుబాబులకు బీర్ల కొరత కష్టాలు తీరిపోనున్నాయి. అప్పటికప్పడు తయారయ్యే ఇన్‌స్టంట్ బీరుతో దాహం తీర్చుకోవచ్చు.ఇక ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యింది. రాష్ట్రంలో కొత్తగా70 బార్లను ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఆదాయం ఎక్కువగా వచ్చే ప్రాంతాలపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 

Also Read: TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మారనున్న దర్శనం రూల్స్.. కొత్త రూల్స్ ఇవే!

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 1,171 బార్లు ఉండగా.. వీటిలో సగానికి పైగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ ల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రధాన పట్టణాలు, నగరాల్లో కొత్తగా బార్లు ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైనట్లు తెలిసింది. ఎక్సైజ్ ఖజానా పెంచుకునేందుకు ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. దాంతో పాటుగా.. మైక్రోబూవరీల సంఖ్యను కూడా పెంచనున్నారు.

ఈ మేరకు నగరంలో ఇన్‌స్టంట్ బీర్ కేఫ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం రెడీ అయ్యింది. తెలంగాణలో కొత్తగా మద్యం బ్రాండ్లు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో బీర్లు, లిక్కర్‌ అమ్మేందుకు కంపెనీల నుంచి TGBCL అఫ్లికేషన్లకు  ఆహ్వానం పలికింది. 40 వరకు కంపెనీలు లిక్కర్ సరఫరా చేసేందుకు ముందుకు రాగా.. అందులోనూ 20 దాకా విదేశీ లిక్కర్‌ బ్రాండ్లు ఉన్నట్లు సమాచారం. 10 వరకు బీర్ల కంపెనీలు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.

Also Read: Banking New Rules: బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి 7 కొత్త రూల్స్.. లిస్ట్ ఇదే!

Also Read: Ap-Telangana: ఏపీ, తెలంగాణ ప్రయాణికులకు అలర్ట్.. 32 రైళ్లు రద్దు, మరో 11 దారి మళ్లింపు..!

wines | liquor | government | telangana-govt | telangana govt good news | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు