Rahul Gandhi: ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేఖ
ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు.
ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కోరారు.
సేవ్ కర్రెగుట్ట ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని మావోయిస్ట్ లీడర్ ప్రభుత్వానికి లేఖ రాశాడు. శాంతి చర్చలకు రావాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు ఇంచార్జ్ రూపేష్ అలియాస్ తక్కిళ్ళపల్లి వాసుదేవన్ పేరిట లేఖ విడుదలైంది.
జూబ్లీహిల్స్ జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఖాళీ స్థలంలో ఓ బాలుడు క్రికెట్ ఆడుకునేవాడు. కొన్నిరోజులుగా అక్కడ కంచె వేసి నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో ఆ బాలుడు హైడ్రా కమిషనర్కు లెటర్ రాశాడు. ఆ చుట్టు పక్కల 39 ఎకరాలు ఆక్రమణకు గురైందని బయటపడింది.
మధ్యప్రదేశ్ లో ఓ వింత దొంగతనం జరిగింది. అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు.
మగాళ్లను మర్డర్ చేసే అవకాశం ఇవ్వాలంటూ NCP SP నేత రోహిణి ఖడ్సే రాష్ట్రపతి ద్రౌపదీకి లేఖ రాశారు. మహిళలపై నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో శిక్ష లేకుండా ఈ వెసులుబాటు కల్పించాలని కోరారు. దీంతో ఆశకు హద్దుండాలంటూ ఆమెపై మగజాతి దుమ్మెత్తిపోస్తోంది.
ఎలన్ మస్క్కు సుఖేష్ చంద్ర శేఖర్ జైలు నుంచి లేఖ రాశాడు. ఎక్స్ కంపెనీలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతానని ఆఫర్ ఇచ్చాడు. DOGEకి నాయకత్వం వహించినందుకు మస్క్ను అభినందించాడు. LSహోల్డింగ్స్ గతంలో టెస్లా స్టాక్స్లో పెట్టుబడి పెడితే లాభాలు వచ్చాయన్నాడు.
ఛత్తీష్గడ్ ఎన్కౌంటర్పై మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపడంతో 24 మంది గ్రామస్తులు గాయపడ్డారని మండిపడ్డారు. దీనికి నిరసనగా ఫిబ్రవరి 18న బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల్లో బంద్కు పిలుపునిస్తున్నట్లు బహిరంగ లేఖలో తెలిపారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఇటీవల కేసీఆర్ సోదరి మరణించడంపై ఆయన సంతాపాన్ని ప్రకటించారు. కేసీఆర్ కుటుంబానికి సానుభూతిని ప్రకటించారు. కేసీఆర్ సోదరి సకలమ్మ అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే.