/rtv/media/media_files/2025/06/26/congress-election-commission-2025-06-26-13-49-41.jpg)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై గురువారం కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. కాంగ్రెస్ ఓటర్ల జాబితా, పోలింగ్ రోజు వీడియో ఫుటేజీని ఇవ్వాలని డిమాండ్ చేసింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలతో లేఖను పంపింది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఓటింగ్లో పారదర్శకత లేదంటూ ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ వస్తున్నది. మహారాష్ట్ర, హర్యానా ఓటర్ల జాబితాల డిజిటల్, మెషిన్-రీడబుల్ కాపీలను వారంలోగా అందుబాటులో ఉంచాలని కాంగ్రెస్ పార్టీ లేఖలో స్పష్టంగా పేర్కొంది. పోలింగ్ రోజు వీడియో రికార్డింగ్ను ఇవ్వాలని కోరింది. ఈ పని ఎన్నికల సంఘానికి కష్టమైన పనేం కాదని చెప్పుకొచ్చింది.
Congress writes to the Election Commission in response to ECI's letter to LoP Lok Sabha Rahul Gandhi, offering to meet and discuss the issues about the Maharashtra 2024 Vidhan Sabha election that he and the Congress party raised.
— ANI (@ANI) June 26, 2025
The letter reads, "We request you to provide us… pic.twitter.com/USOxfgdnTI
రాజకీయ పార్టీల విశ్వాసాన్ని పెంచడం, ఎన్నికల ప్రక్రియలో ప్రజల విశ్వాసాన్ని నిలుపుకోవాలని కోరింది. అయితే, పార్టీ అగ్రనాయకులు ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు సిద్ధంగా ఉందని ఆ పార్టీ తెలిపింది. మొత్తం ఎన్నికల ప్రక్రియపై బహిరంగ చర్చ జరిగేలా ఆధారాలను కమిషన్ ముందుంచనున్నది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను బహిర్గతం చేసే డేటా, విశ్లేషణ తమ వద్ద ఉందని పార్టీ పేర్కొంది. మహారాష్ట్ర, హర్యానాలో ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ పనితీరుపై ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నలు లేవనెత్తిన విషయం తెలిసిందే.