సెంట్రల్ బలగాలు, ఛతీస్గఢ్ పోలీసులు సేవ్ కర్రెగుట్టలు జాయింట్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. మూడు రోజులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఆ నక్సల్ యాంటీ ఆపరేషన్ వెంటనే ఆపివేయాలని మావోయిస్ట్ పార్టీ నాయకుడు లేఖ రాశాడు. ఆపరేషన్ నిలిపి.. శాంతి చర్చలకు రావాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నార్త్ వెస్ట్ బస్టర్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు ఇంచార్జ్ రూపేష్ అలియాస్ తక్కిళ్ళపల్లి వాసుదేవన్ పేరిట మావోయిస్టు పార్టీ లేఖ విడుదలైంది.
చర్చల కోసం ముందుకు రావాలంటూ లేఖ సారాంశం. సైనిక చర్యను తక్షణమే నిలిపివేయాలంటూ లేఖలో డిమాండ్
చేశారు. శాంతి చర్చలకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఎప్పుడూ సిద్ధమేనని రూపేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్దేశ్యం వేరేలా కనిపిస్తోందని ఆయన అంటున్నారు. హింస ద్వారా సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన అన్నారు. ఆపరేషన్ కగార్ను నెల రోజులు వాయిదా వేయాలన్నారు.
Also read: Minister Uttam Kumar: NDSA నివేదిక చూసి బీఆర్ఎస్ సిగ్గు పడాలి
చతీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా సరిహద్దుల్లో కర్రెగుట్టల అనే అటవి ప్రాంతం ఉంది. మావోయిస్టుల అగ్రనేతలు చాలామంది ఆ ప్రాంతంలో ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. బీజాపూర్, తెలంగాణ సరిహద్దులు జరుగుతున్న సైనిక ఆపరేషన్ వెంటనే ఆపాలని రూపేష్ లేఖలో పేర్కొన్నారు.
Also read: Maoist Operation: తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దుల్లో హై టెన్షన్
(letter | maoist-letter | Maoist Letter on Encounter | chattisgarh border | chattisaghad | latest-telugu-news | telangana | Anti-Maoist Operation | Maoists In Mulugu Karre Gutta | Maoists Mulugu Karre Gutta)