HYD Cyber Crime: హైదరాబాద్లో వృద్ధుడిని వదలని సైబర్ కేటుగాళ్లు.. రూ.53 లక్షలు ఫసక్
హైదరాబాద్కు చెందిన 77ఏళ్ల వృద్ధుడు సైబర్ నేరగాళ్ల వలలో పడ్డాడు. మనీలాండరింగ్ జరిగిందని, అరెస్టు వారెంటీ జారీ చేశామని చెప్పడంతో రూ.53లక్షలు పంపించేశాడు. వెంటనే కేటుగాళ్లు కాల్ కట్ చేసి పత్తా లేకుండా పోయారు. దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.