Crime News: దారుణం.. 14 నెలల చిన్నారిపై అత్యాచారం చేసి.. వరి పొలంలో పాతిపెట్టిన దుర్మార్గుడు

ఉత్తర త్రిపురలోని పానిసాగర్ ప్రాంతంలో 14 నెలల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపాడు. పాపను ఆడిపించడానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆపై దారుణంగా హత్య చేసి వరి పొలంలో పాతిపెట్టాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

New Update
Baby

raped

నేటి కాలంలో చిన్నారులపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. పసిపాపలు అని చూడకుండా దారుణానికి పాల్పడుతున్నారు. ఇటీవల త్రిపురలోనూ ఇలాంటి దారుణ ఘటన జరిగింది. ఉత్తర త్రిపురలోని పానిసాగర్ ప్రాంతంలో 14 నెలల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపాడు. నీలాంబజార్ ప్రాంతానికి చెందిన వ్యక్తి రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు. పాపను ఆడిపించడానికి తీసుకెళ్లాడు.

ఇది కూడా చూడండి: Crime: దారుణం.. కన్న కొడుకు ముందే భర్తను హత్య చేసిన భార్య

బిడ్డను తిరిగి ఇవ్వకపోవడంతో..

మూడు గంటలు దాటినా కూడా నిందితుడు బిడ్డను తిరిగి ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే ఆ చిన్నారిని వెతకడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఓ వరి పొలంలో ఆ చిన్నారి మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇది కూడా చూడండి: Drowning: తీవ్ర విషాదం.. సముద్రంలో స్నానానికి వెళ్లి ముగ్గురి మృతి

Advertisment
తాజా కథనాలు