Israel: ఇరాన్ను నాశనం చేస్తాం.. ఇజ్రాయెల్ సంచలన హెచ్చరిక
ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ ఇరాన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగిస్తే.. టెహ్రన్ తగలబడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు.
ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కాట్జ్ ఇరాన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇరాన్ తమపై క్షిపణులు ప్రయోగిస్తే.. టెహ్రన్ తగలబడిపోతుందని హెచ్చరికలు జారీ చేశారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. యుద్ధ వాతావరణం కొనసాగుతున్న క్రమంలో మరో కీలక అప్డేట్ వచ్చింది. ఇరాన్ మరో ఇద్దరు కీలక అధికారులను కోల్పోయినట్లు తెలుస్తోంది.
ఇరాన్ దగ్గరున్న ఈ 5 ఆయుధాలతో ఇజ్రాయిల్ భయపడుతుంది. రక్షణ వ్యవస్థలో బలమైన ఇజ్రాయిల్కు ఏ మాత్రం తగ్గకుండా ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఫతా క్షిపణి, అబూ మహదీ క్షిపణి, షాహెద్ 136, మొహజీర్-10 డ్రోన్, ఫతే-110 క్షిపణి ఆయుధాలు ఇవే.
ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అమెరికాతో న్యూక్లియర్ డీల్ చేసుకోవాలని హెచ్చరించారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదన్నారు. పరిస్థితి దాటకముందే తమతో చర్చలు జరపాలని ఆయన స్పష్టం చేశారు. ఇ
ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. వాళ్ళ అణుస్థావరాలే లక్ష్యంగా క్షిపణులను ప్రయోగిస్తోంది. అసలెందుకు ఈ రెండు దేశాలు కొట్టుకుంటున్నాయి. ఒకప్పటి మిత్రులు ఇప్పుడు ఎందుకు బద్ధ శత్రువులయ్యాయి.
మిడిల్ ఈస్ట్ మళ్ళీ రగులుతోంది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. రాజధాని టెహ్రాన్ మీద కూడా దాడులు జరిగాయి. ఈ భీకర దాడుల్లో ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినదే నిజమౌతోంది. ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ లోని ఈశాన్య ప్రాంతంలో పేలుళ్ళ శబ్దాలు వినిపంచాయని చెబుతున్నారు. సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు జరిగాయని తెలుస్తోంది.