/rtv/media/media_files/2025/06/20/militants-2025-06-20-23-16-20.jpg)
militants are getting ready to attack on Iran
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ అల్లకల్లోలంగా తయారయింది. ఇరాన్ కన్నా చిన్న దేశమైనా ఆర్థికంగా, మిగతా అన్ని విషయాల్లో కూడా బలంగా ఉన్న ఇజ్రాయెల్ పట్టిన పట్టు వీడటం లేదు. ఇరాన్ అంతు చూసేదాకా వదిలిపెట్టేది లేదని చెబుతోంది. దానికి ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా కూడా తోడైంది. ఇరాన్ అణు ఒప్పందం చేసుకోలేదని సాకుగా దాడులకు సన్నద్ధమౌతోంది. వచ్చే వారం ఏమైనా జరగొచ్చని వైట్ హౌస్ ప్రకటన కూడా చేసింది. దీంతో ఇరాన్ బైటికి బీరాలు పోతున్నా...లోపల కక్కలేక మిగలేక చేస్తోంది.
మిలిటెంట్ల దాడి అవకాశం..
వీటన్నింటికీ తోడు ఇరాన్ మరిన్ని సమస్యల్లో చిక్కుకోనుందని వార్తలు వస్తున్నాయి. ఓ వైపు బలోచిస్థాన్ వేర్పాటు వాదులు, మరోవైపు ఇరాన్ వేర్పాటువాదులు దాడులకు కాచుకుని కూర్చొన్నారు. సరన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. యుద్ధంలో ఇరాన్ మరింత బలహీనపడితే ఒక్క ఉదుటున దాడి చేద్దామని ప్లాన్ లు వేస్తున్నాయి. ఇదే కనుక జరిగితే టు ఇరాన్ కు అటు పాకిస్తాన్ కు కూడా పెద్ద దెబ్బే అవుతుంది. ఒకవేళ ఖమేనీ ప్రభుత్వం కూలిపోతే.. బలోచిస్థాన్ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతుందని పాక్ భావిస్తోంది. ఎక్కువ మంది బలోచ్ ప్రజలు పాకిస్థాన్లోని బలోచిస్థాన్, ఇరాన్ సరిహద్దులో ఉన్న సిస్థాన్, బలూచిస్థాన్ ప్రాంతాల్లో ఉన్నారు. ఇరాన్ ప్రభుత్వం వీరిని ఎప్పటి నుంచో అణిచి వేస్తోంది. వీరంతా సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇరాన్ బలహీనమవుతున్న టైమ్ లో అందరూ ఏకమై మూకుమ్మడిగా దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే కనుక జరిగితే పాక్ కు కూడా తంటాలు తప్పవు. ఇదే అంశాన్ని ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో జరిగిన సమావేశంలో.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ప్రస్తావించినట్లు చెబుతున్నారు.
మరోవైపు పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న జైష్ అల్ అదిల్ మిలిటెంట్ గ్రూప్ కూడా భయపెడుతోంది. ఇది కూడా ఇరానియన్ వేర్పాటు వాద సంస్థే. ఇప్పటికే ఈ సంస్థ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం గొప్ప అవకాశమని ప్రకటించింది. దీంట్లో కూడ బలోచ్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఏదేమైనా.. ఇరాన్-పాకిస్థాన్ సరిహద్దుకు ఇరువైపులా ఉన్న మిలిటెంట్లు తమ ప్రభుత్వాలపై దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. బలోచ్ ప్రజలు కేవలం పాకిస్థాన్లో మాత్రమే కాకుండా, ఇరాన్, అఫ్గానిస్థాన్లో జీవిస్తున్నారు. పాకిస్థాన్ జనాభాలో 3.6 శాతం వీళ్లే. ఇరాన్, అఫ్గానిస్థాన్ జనాభాలో 2 శాతం వరకు ఉంటారు.