Iran: చమురుకు ఇక కటకటే..హర్మూజ్ ను మూసేస్తామంటున్న ఇరాన్

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం భీకరంగా మారుతోంది. ఇందులోకి అగ్రరాజ్యం కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ కాస్త బలహీన పడుతున్నట్టుగా కనిపిస్తోంది. దీంతో ఇరాన్ వేరే రకంగా భయపెట్టడానికి చూస్తోంది. హర్మూజ్ జలసంధిని బూచిగా చూపిస్తోంది. 

New Update
strait-of-hormuz

strait-of-hormuz

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మొదలై ఈరోజుకు తొమ్మిది రోజులు. రెండు దేశాలు ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఈ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా తో సహా అన్ని ప్రపంచ దేశాలూ ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తున్నాయి. మొన్న జరిగిన జీ7 దేశాల సదస్సులో ఏకగ్రీవంగా దీన్ని తీర్మానించాయి. మరోవైపు ఇరాన్ వైపు 21 ముస్లిం దేశాలు మాత్రమే నిలబడ్డాయి. అదీకాక ఇరాన్ ఇప్పటికైతే బీరాలు పోతూ యుద్ధం చేస్తోంది. కానీ క్రమంగా దాని పవర్ తగ్గిపోతోంది. దీంతో ఇజ్రాయెల్ మీద వత్తిడి తెచ్చేందుకు వేరే మార్గాలను అన్వేషిస్తోంది. 

హర్మూజ్ జలసంధి..

ప్రపంచంలో హర్మూజ్ జలసంధి ద్వారానే 20 శాతం చమురు రవాణా అవుతుంది. అరేబియా సముద్రాన్ని, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఇరుకైన సముద్ర మార్గమే ఈ హర్మూజ్ జలసంధి. ఈ సన్నటి మార్గం కేవలం 33 కిలోమీటర్లు (21 మైళ్లు) వెడల్పు ఉంటుంది. భారత్, చైనా, అమెరికాలతో పాటూ కువైట్, బహ్రైన్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇరాన్ వంటి దేశాలు చేసే చమురు ఎగుమతులు కూడా ఈ మార్గం ద్వారానే జరుగుతాయి. ఈ హర్మూజ్ జలసంధి చుట్టూ ఉన్న ద్వీపాలు అన్నీ ఇరాన్ ఆధీనంలోనే ఉన్నాయి. ఇక్కడ ఆ దేశ సైనిక ఉనికి కూడా బలంగా ఉంది. ఈ ద్వీపాల నుంచి చమురు రవాణా అవుతుంది. ఇప్పుడు కనుక ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేస్తే చమురు రవాణా ఆగిపోతోంది. దీంతో చాలా దేశాలకు నష్టం వాటిల్లుతుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఈ జలసంధిని బూచిగా చూపిస్తోంది ఇరాన్. దీన్ని మూసేస్తామంటే ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్ మీద యుద్ధం ఆపేయాలని వత్తిడి తీసుకువస్తారని ఆశిస్తోంది. 

 

Also Read: 

Advertisment
Advertisment
తాజా కథనాలు