Iran-Israel War: 8వ రోజుకు చేరుకున్న యుద్ధం..క్లస్టర్ బాంబ్స్ తో విరుచుకుపడుతున్న ఇరాన్

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 8వ రోజుకు చేరుకుంది.రెండు దేశాలు ఒక దానిపై ఇంకొకటి భీకర దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్ అణు స్థావరాలపై అటాక్ చేస్తుంటే..ఇరాన్ మాత్రం ఆసుపత్రులు, భవనాలే టార్గెట్ గా దాడులు చేస్తోంది. తాజాగా క్లస్టర్ బాంబులను ప్రయోగించింది.

New Update
cluster bombs

Iran fires missiles with cluster bombs

 

యుద్ధం మొదలై వారం దాటిపోయింది. ఇరాన్, ఇజ్రాయెల్ ఇంకా పగతో రగులుతూనే ఉన్నాయి. ఒకరిపై ఒకరు బాంబులతో విరుచుకుపడుతున్నారు. ఇజ్రాయెల్ అణు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగిస్తోంది. కానీ ఇరాన్ మాత్రం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ బాంబులను వదులుతోంది. ఇజ్రాయెల్ లో ఓ ఆసుపత్రిపై క్షిపణిని ప్రయోగించింది ఇరాన్. ఇందులో దాదాపు 71 మంది గాయపడ్డారు. దీనిపై ఆ దేశ ప్రధాని నెతన్యాహు మండిపడ్డారు. దీనికి ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు. 

క్లస్టర్ బాంబులతో దాడి..

శుక్రవారం రెండు దేశాలు క్షిపణులు,డ్రోన్లతో దాడి చేసుకున్నాయి.  ఇజ్రాయెల్ ఇరాన్‌లోని అణు మౌలిక సదుపాయాలపై బాంబు దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ క్లస్టర్ మందుగుండు సామాగ్రితో క్షిపణులను ప్రయోగించింది. ఇటు వంటి ఆయుధాలను ఉపయోగించడం మొదటిసారని కూడా తెలిపింది. దీంతో ఈ యుద్ధం మరింత ఎక్కువ అయ్యే ఛాన్స్ కనబడుతోందే తప్పా ఎక్కడా తగ్గే అవకాశం లేదనిపిస్తోంది. మరోవైపు ఈ యుద్ధంలోకి అగ్రరాజ్యం కూడా అడుగు పెట్టే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. వచ్చే వారం ట్రంప్ పెద్ద నిర్ణయాలు తీసుకుంటారని వైట్ హౌస్ ప్రకటించింది. ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఖ్చితో చాలా సార్లే చర్చలు చేశారని..కానీ ఆ దేశం అణు ఒప్పందానికి ససేమిరా అంటోందని చెప్పింది. ఇరాన్ పై దాడులు చెయ్యక తప్పని పరిస్థితి ఉందని వౌట్ హౌస్ పరోక్షంగా చెబుతోంది. మరోవైపు అణు ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ చాలా నష్టపోతుందని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. 

 

Also Read: IND-ENG: భారత క్రికెట్ లో కొత్త చాప్టర్..ఇంగ్లాండ్ తో మొదట టెస్ట్ ఈరోజు నుంచే..

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు