/rtv/media/media_files/2025/06/20/iran-china-2025-06-20-07-11-26.jpg)
Iran-China
గత వారం రోజులుగా చైనా నుంచి ఇరాన్ కు బోయింగ్ 747 విమానాలు చాలానే వస్తున్నాయని తెలుస్తోంది. ఇరాన్ కు యుద్ధంలో చైనా సహాయం చేస్తోందని అంటున్నారు. యూఎస్ కు చందిన ఫాక్స్ న్యస్ దీనికి సంబంధించి నివేదికలను ఇచ్చింది. జూన్ 14 తర్వాత చైనా నుంచి ఇరాన్ కు ఐదు బోయింగ్ లు వెళ్ళాయని ఫ్లైట్ రాడార్ లో చూపిస్తోంది. వాటితో పాటూ మిస్టరీ ట్రాన్స్ పోర్ట్ విమానాలు కూడా ఇరాన్ కు ప్రయాణించినట్లు తెలుస్తోంది. కజకిస్తాన్లోకి, దక్షిణాన ఉజ్బెకిస్తాన్,తుర్క్మెనిస్తాన్ గుండా ప్రయాణించాయని, ఆపై ఇరాన్ను సమీపించాక రాడార్ ఆగిపోయిందని చెబుతున్నారు. ఈ విమానాలకు గమ్యస్థానం లక్సెంబర్గ్ అయినప్పటికీ అవి అక్కడి చేరినట్లు కనిపించడం లేదని ఫాక్స్ న్యూస్ చెబుతోంది. యూరోపియన్ గగనతంలోకి విమానాలు ప్రవేశించినట్లు కనిపించడం లేదని తెలిపింది.
ఇరాన్ కు సహాయం చేయడానికే..
చైనా నుంచి వెళ్ళిన ఫ్లైట్ లు సాధారణంగా రవాణాకు ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇరాన్ కు చైనా ఎప్పటి నుంచో మిత్ర దేశం. అందుకే ఇప్పుడు దానికి హెల్ప్ చేయడానికి డ్రాగన్ కంట్రీ ప్రయత్నిస్తోందని అంటున్నారు. దానికి తోడు చైనా చమురు, గ్యాస్లో నలభై మూడు శాతం మధ్యప్రాచ్యం నుండి వస్తున్నాయి. అందులో మళ్ళీ ఎక్కువ భాగం ఇరాన్ నుండి వస్తున్నాయి అని హెరిటేజ్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ నేషనల్ డిఫెన్స్ డైరెక్టర్ రాబర్ట్ గ్రీన్వే చెబుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇరాన్..చైనాకు చమురు , గ్యాస్ సరఫరా చేసే స్థితి లేదు. అందుకే అక్కడి నుంచి వచ్చిన విమానాలు కచ్చితంగా ఇరాన్ కు సహాయం చేయడానికే వచ్చాయని అంటున్నారు. వీటి ద్వారా ఇరాన్ సామగ్రి లేదా సిబ్బందిని లేదా పాలన విలువైన వస్తువులను సురక్షితమైన స్వర్గధామానికి తరలించే అవకాశం ఉంది.
Also Read: USA: ఇరాన్ పై దాడులు.. రెండు వారాల్లో నిర్ణయిస్తారు..వైట్ హౌస్