/rtv/media/media_files/2025/06/21/iran-earthquake-2025-06-21-07-39-07.jpg)
జూన్ 20, శుక్రవారం రాత్రి ఇరాన్లోని సెమ్నాన్ ప్రావిన్స్లో ఒక మోస్తరు తీవ్రతతో భూకంపాలు నమోదయ్యాయి, దీనివల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇప్పటివరకు అయితే పెద్ద నష్టం సంభవించలేదు. భూకంపం భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:49 గంటలకు భూకంపం సంభవించగా దాని తీవ్రత అప్పుడు 5.2 గా రికార్డు అయింది. సెమ్నాన్ నగరానికి ఆగ్నేయంగా 87 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం నమోదైంది. యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC), జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ), సిటిజన్ సీస్మోగ్రాఫ్ నెట్వర్క్ రాస్ప్బెర్రీ షేక్ కూడా భూకంపాన్ని నిర్ధారించాయి. దాని కేంద్రాన్ని 35 కిలోమీటర్ల లోతులో నమోదు చేశాయి. ఇజ్రాయెల్తో ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ భూకంపాలు సంభవించడం అందర్ని షాక్ కు గురిచేశాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం మొదలై ఈరోజుకు తొమ్మిది రోజులు. రెండు దేశాలు ఎక్కడా తగ్గడం లేదు. అయితే ఈ యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికా తో సహా అన్ని ప్రపంచ దేశాలూ ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తున్నాయి. మొన్న జరిగిన జీ7 దేశాల సదస్సులో ఏకగ్రీవంగా దీన్ని తీర్మానించాయి. మరోవైపు ఇరాన్ వైపు 21 ముస్లిం దేశాలు మాత్రమే నిలబడ్డాయి. అదీకాక ఇరాన్ ఇప్పటికైతే బీరాలు పోతూ యుద్ధం చేస్తోంది.