Delhi: ఆర్థిక, రెవెన్యూ ఆమె దగ్గరే...ఢిల్లీ మంత్రుల శాఖల కేటాయింపులు ఇవే..
ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువు దీరింది. ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు. దీని తర్వాత మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ కూడా పూర్తయింది. సీఎం తనవద్దే ఆర్థిక, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమ శాఖ, సమాచార ప్రసారాల శాఖలను ఉంచుకున్నారు.