BIG BREAKING: పాక్‌కి సపోర్ట్‌గా కథనాలు.. బీబీసీకి కేంద్రం అభ్యంతర లేఖ

పాక్‌కి సపోర్ట్‌గా కథనాలు ప్రచురించిందని లేఖ ద్వారా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బీబీసీకి లేఖ రాసింది. ఇటీవల ప్రచురించిన ఓ ఆర్టికల్‌లో ఉగ్రదాడికి బదులు మిలిటెంట్ దాడి అని బీబీసీ రాసింది. ఈ క్రమంలోనే అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసింది. 

New Update
Government letter to BBC

Government letter to BBC

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బీబీసీకి లేఖ రాసింది. పాక్‌కి సపోర్ట్‌గా కథనాలు ప్రచురించిందని లేఖ ద్వారా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉగ్రదాడి ప్రభావం వల్ల పాకిస్థాన్ భారతీయుల వీసాలను రద్దు చేసిందని బీబీసీ ఇటీవల ఓ ఆర్టికల్‌ను ప్రచురించింది. ఇందులో ఉగ్రదాడికి బదులు మిలిటెంట్ దాడి అని రాసింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడ్డారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల శాఖ అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసింది. 

ఇది కూడా చూడండి: Pakistan-India-China: భారత్‌-పాక్‌ పరిణామాలను చాలా క్షుణంగా పరిశీలిస్తున్నాం!

ఇది కూడా చూడండి: KCR: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. దద్దరిల్లిన కేసీఆర్ ప్రసంగం

ఇది కూడా చూడండి: Pak-India:భారత్‌తో ఉద్రిక్తతల వేళ పాక్‌కు బిగ్ షాక్.. సైనిక అధికారులు, జవాన్ల భారీ రాజీనామాలు!

యూట్యూబ్ ఛానెళ్లను బ్యాన్ చేసి..

ఇదిలా ఉండగా పాకిస్థాన్ కేంద్రంగా నిర్వహిస్తున్న యూట్యూబ్ ఛానళ్లను కేంద్రం నిషేధించింది. డాన్, జియో న్యూస్, సామా టీవీ వంటి మొత్తం 16 ఛానళ్లపై వేటు వేసింది. చివరకు మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఛానల్‌లో కూడా ప్రసారాలు ఏం లేవు. జాతీయ భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యూట్యూబ్ ఛానళ్లను నిషేధించింది. భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టే వీడియోలు, మతపరమైన కంటెంట్, తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్‌ ఛానళ్లను నిషేధించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు పాకిస్థాన్ ప్రభుత్వానికి చెందిన ఎక్స్‌ ఖాతాను భారత్‌లో నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

Advertisment
Advertisment
తాజా కథనాలు