/rtv/media/media_files/2025/07/09/bridge-collopse-2025-07-09-10-21-52.jpg)
గుజరాత్ వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విషాద ఘటనలో 16 మంది మృతి చెందారు. ఇందులో నిర్లక్ష్యం వహించిన నలుగురు ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు పడింది. రాష్ట్ర రోడ్లు, భవనాల విభాగానికి చెందిన నలుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేశారు.
VIDEO | Vadodara bridge collapse: "Yesterday, a sad incident took place in Gujarat's Padra taluka. The district administration had sent requisition for one team of NDRF. The team was rushed to the incident site immediately. When I reached the spot, I felt that one more team is… pic.twitter.com/2vTSxppwaS
— Press Trust of India (@PTI_News) July 10, 2025
అకస్మాత్తుగా వంతెన కూలిపోవడంతో వాహనాలు, ప్రయాణికులు నదిలో పడిపోయారు. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేసి పలువురు కాపాడారు. వడోదర - ఆనంద్ జిల్లాలను కలుపుతూ గంభీర బ్రిడ్జి నిర్మించారు. ఇప్పుడు బ్రిడ్జి కూలడంతో ఆనంద్, వడోదర, భారూచ్, అంకాళేశ్వర్ ప్రాంతాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి.