SKM: రైతులకు SKM కీలక పిలుపు.. పోలీసుల అణచివేతపై దేశవ్యాప్తంగా నిరసన!
రైతులకు 'సంయుక్త కిసాన్ మోర్చా' మరో కీలక పిలుపునిచ్చింది. పంజాబ్ పోలీసుల చర్యకు వ్యతిరేకంగా మార్చి 28న దేశవ్యాప్తంగా రైతులంతా ఆయా జిల్లాల్లో నిరసన చేపట్టాలని కోరింది. కనీస మద్దతు ధర, రుణమాఫీ, వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై ఆందోళనకు దిగాలని సూచించింది.