YS Jagan : మామిడి రైతులకు అన్యాయం... ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే వచ్చా.. జగన్ కీలక వ్యాఖ్యలు
మామిడి రైతులను ప్రభుత్వ పట్టించుకోవడం లేదని, వారికి అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించిన జగన్ బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు.