/rtv/media/media_files/2025/05/05/GwZOGOKDGPplFE0XvfSr.jpg)
30 acres of crops burnt
Warangal Fire Accident: వరంగల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 30 ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న పంట పూర్తిగా దగ్ధమైంది. చేతికొచ్చిన పంట బుగ్గిపాలు కావడంతో అన్నదాతలు కంటికిధారగా విలపిస్తున్నారు.
Also Read : కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!
Also read : TGSRTC : బస్సు భవన్ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..
రైతులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం మొగిలిచర్లలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గీసుకొండ నుంచి మొగిలిచెర్లకు వెళ్లే రహదారిపై రైతులు 30 ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న కంకులను కత్తిరించి ఎండలో ఆరబెట్టారు. రాత్రి ఓ రైతు చేనులో మొక్కజొన్న చొప్పను కాల్చేందుకు నిప్పుపెట్టగా.. ప్రమాదవశాత్తు అది దావానలంలా వ్యాపించింది. కొన్ని క్షణాల్లోనే పక్కనే ఉన్న చేలకు మంటలు అంటుకుని తీవ్రరూపం దాల్చాయి. భారీగా ఎగిసిపడిన అగ్నికీలలను అర్పేందుకు స్థానికులు యత్నించినా.. మంటలు అదుపులోకి రాలేదు. దీంతో వరంగల్ నుంచి రెండు ఫైరింజిన్లను రప్పించి మంటలను అదుపు చేశారు.
Also read : India vs Pakistan : భారత్ను రెచ్చ గొట్టడమే లక్ష్యంగా.. పాక్ మరోసారి క్షిపణి ప్రయోగం?
Also Read : PM Modi: ఆర్మీ సూట్లో ప్రధాని మోదీ.. ఉగ్రవాదంపై సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్
కండ్లముందే చేతికొచ్చిన పంట మంటల్లో కాలిపోతుంటే కంటినిండా నీళ్లతోనే రైతులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఎంతకు అదుపులోకి రాలేదు. వరంగల్ నుంచి ఫైరింజన్లు వచ్చేసరికి 30 ఎకరాలకు చెందిన మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
Also read : ఖమ్మంలో డిజిటల్ అరెస్ట్ కలకలం.. ఒక్క కాల్ తో రూ.26 లక్షలు ఎలా కొట్టేశారంటే?