KTR: నేతన్నలవి ప్రభుత్వ హత్యలే- సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న నేతన్నలవి ఆత్మహత్యలు కాదు.. అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. నేతన్నలకు ఉపాధి లేక ఉసురు తీసుకుంటున్నా ఆదుకోరా అని నిలదీశారు. దీనికి సంబంధించి ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.