సడెన్గా విమానంలో చెలరేగిన మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు
దక్షిణ కొరియాలో 176 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మంటల్లో చిక్కుకుంది. బుసాన్ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.