/rtv/media/media_files/2025/06/13/eXPzyJmQih0VKsRxTEWc.jpg)
గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైన కొన్ని గంటల్లోనే మరో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. థాయ్లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది థాయ్ల్యాండ్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో బాంబ్ స్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన విమానం కూడా ఎయిర్ ఇండియాకు చెందిందే.
🚨 HUGE! Air India flight AI379, en route from Phuket, Thailand to Delhi, made an EMERGENCY landing after a BOMB THREAT was reported onboard.
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 13, 2025
— The aircraft landed SAFELY, all passengers and crew are SAFE, and NO injuries have been reported. pic.twitter.com/5rlqRIqxMb
థాయిలాండ్లోని ఫుకెట్ నుండి ఢిల్లీకి బయల్దేరుతున్న ఎయిర్ ఇండియా విమానం AI379లో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు. బెందిరింపులకు పాల్పడింది ఎవరూ.. ఫ్లైట్లో నిజంగానే బాంబ్ ఉందా అని థాయ్లాండ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.