Emergency Landing: ఇండిగో విమానంలో మహిళ మృతి

ముంభై నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ మహిళ మృతి చెందింది. ఆదివారం రాత్రి 10 గంటలకు సుశీల దేశి(89) అనారోగ్యంతో మరణించింది. ఛత్రపతి శంభాజీనగర్‌లోని చికల్తానా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి మిగిలిన వారితో ఫ్లైట్ వారణాసి బయలుదేరింది.

New Update
women die in flihgt

women die in flihgt

Emergency Landing: గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఓ మహిళ మృతి చెందింది. ముంబై నుంచి వారణాసికి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో ఓ వృద్ధురాలు మరణించింది. వెంటనే ఎయిర్‌లైన్స్ సిబ్బంది మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని చికల్తానా విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన 89 ఏళ్ల సుశీలా దేవి ఆదివారం రాత్రి 10 గంటలకు అనారోగ్యంతో ఫ్లైట్‌లో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మెడికల్ ఎమర్జెన్సీ కోసం ఫ్లైట్ ల్యాండ్ చేసి ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికీ సుశీలా దేవి మరణించిందని డాక్టర్లు చెప్పారు. 

Also Read: Lady Aghori: ప్రభాస్ ఇంటి పక్క ఆ విల్లాపై అఘోరీ క్లారిటీ.. అది మాత్రమే నిజం

Also Read: వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తింటే మంచిది


MIDC CIDCO పోలీస్ స్టేషన్ ఫార్మాలిటీస్ పూర్తి చేసింది. తర్వాత విమానం మిగితా ప్రయాణీకులతో వారణాసికి బయలుదేరిందని అధికారి తెలిపారు. విమానయాన సంస్థ ప్రకారం, మహిళ మృతదేహాన్ని ఛత్రపతి సంభజినగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు పంపారు.

Also Read: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

Also Read: Gachibowli land dispute : కేటీఆర్, కిషన్‌రెడ్డిలకు బిగ్ షాక్.. త్వరలో విచారణకు!

Advertisment
Advertisment
తాజా కథనాలు