Emergency landing: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

ముంబై రావాల్సిన అట్లాంటిక్ విమానం టర్కీలోని దియార్‌బాకిర్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అందులో 200 మంది భారతీయులు ఉన్నారు. ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడని టర్కీలో ల్యాండ్ అవ్వగా.. తర్వాత ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

New Update
Emergency landing 123

Emergency landing 123 Photograph: (Emergency landing 123)

ముంబై రావాల్సిన అట్లాంటిక్ విమానం టర్కీలోని  దియార్‌బాకిర్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యింది. అందులో 200 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో ఎక్కువగా మహారాష్ట్రకు చెందిన వారే. దీంతో ఈ విషయాన్ని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారంతా లండన్‌ నుంచి ముంబైకి బయలుదేరారు. దీంతో సుమారు 200 మందికి పైగా భారతీయ ప్రయాణికులు అక్కడ చిక్కుకుపోయారు. 16 గంటలకు పైగా పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆ విమానంలోని ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో టర్కీ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. ఆ తర్వాత ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది.

Also read: BIG BREAKING : ఊడిపడ్డ చార్మినార్ పెచ్చులు.. పరుగులు తీసిన జనం

Also : BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’

టర్కీలోని ఆ విమానాశ్రయం విమానాల రాకపోకలకు అనువుగా లేదు. దీంతో సాంకేతిక లోపం వల్ల ఆ విమానం అక్కడి నుంచి టేకాఫ్‌ కాలేకపోయింది. అలాగే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి విమాన సిబ్బంది వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఆ విమానంలోని ప్రయాణికులు ఖాళీగా ఉన్న చిన్న టెర్మినల్‌ బిల్డింగ్‌లో 16 గంటలకుపైగా వేచి ఉన్నారు. చిన్న పిల్లలు, మహిళలతోపాటు అనారోగ్యంతో బాధపడుతున్న వారు కూడా ప్రయాణికుల్లో ఉన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు