Lucknow Encounter Latest Update | లక్నోలో రెండున్నరేళ్ల పాప పై | Accused Deepak Verma | UP News
చత్తీష్గఢ్ స్టేట్ బీజాపూర్ నేషనల్ పార్క్లో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన అడేళ్ల భాస్కర్ మృతి చెందాడు. AK47తో పాటు నక్సలైట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు భాస్కర్పై రూ. 25 లక్షల రివార్డు ఉంది.
చత్తీస్ గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య జరిగిన భీకర ఎన్ కౌంటర్ లో ఒక నక్సలైట్ మృతి చెందినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలం నుండి ఆటోమేటిక్ ఆయుధాన్ని భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో భద్రతా దళాలు, తెహ్రిక్-ఇ తాలిబన్ మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో ఉగ్రవాదులు..పోలీసుల మీదకు హ్యాండ్ గ్రనేడ్లు విసరడంతో పాటూ తమను తాము కాల్చుకున్నారు. ఇందులో ఇద్దరు పోలీసులతో పాటూ తిరుగుబాటు నాయకుడు జర్నోష్ నసీమ్ కూడా మృతి చెందాడు.
జార్ఖండ్లో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు దళ కమాండర్ తులసి భూనియన్ మృతిచెందారు. ఈ క్రమంలో నితేశ్ యాదవ్ అనే మావోయిస్టు గాయపడ్డారని, అతనిపై రూ.15 లక్ష రివార్డు ఉందని అధికారులు చెప్పారు.
వరుస ఎన్కౌంటర్లతో అగ్ర నాయకులను కోల్పోతున్న మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలింది. జార్ఖండ్ లోని లాటేహార్ జిల్లాలో మహుడనే పోలీస్ స్టేషన్ పరిధిలోని కరంఖర్, ధోవ్నా గ్రామాల మధ్య దట్టమైన అడవుల్లో మావోయిస్టు అగ్రనేత ఒకరు మృత్యువాతపడ్డారు.
మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఝూర్ఖండ్ లాతేహార్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఝూర్ఖండ్ జనముక్తి పరిషత్కు చెందిన ఇద్దరు కీలక నేతలు పప్పు లోహరా, ప్రభాత్ గంజు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. పప్పుపై 10లక్షలు, ప్రభాత్పై 5లక్షల రివార్డు ఉంది.
మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గరలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం వచ్చింది. దీంతో గడ్చిరోలి జిల్లాలో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన 27మంది మావోయిస్టుల వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుల్లో 14 మంది మహిళలు ఉన్నారు. తెలంగాణనుంచి ముగ్గురు, ఏపీ నుంచి ఇద్దరున్నట్లు గుర్తించారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారు.