Thushara Case : పాపం వరకట్నం కోసం అన్నం పెట్టకుండా చంపేశారు... కోర్టు సంచలన తీర్పు!
వరకట్నం కోసం 28 ఏళ్ల మహిళను ఆకలితో చంపిన కేసులో ఆమె భర్త, అత్తకి కొల్లం కోర్టు జీవిత ఖైదు విధించింది. తుషార హత్య కేసులో దోషులుగా తేలిన చందూలాల్ (36), గీతా లాలి (62) లకు కొల్లం అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఒక్కొక్కరికి రూ. లక్ష జరిమానా విధించారు.