Crime: మనుషులను చంపి మొసళ్లకు మేత.. 50పైగా హత్యలు చేసిన ఆయుర్వేద వైద్యుడు శర్మ!
సీరియల్ కిల్లర్, ఆయుర్వేద వైద్యుడు దేవేందర్ శర్మను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 50కి పైగా హత్యలు చేసి ఆధారాలు దొరకకుండా డెడ్ బాడీలను మొసళ్లకు మేతగా వేసినట్లు గుర్తించారు. 125కు పైగా అక్రమ కిడ్నీ మార్పిళ్లకు పాల్పడ్డట్లు తెలిపారు.