/rtv/media/media_files/2025/10/25/mh-2025-10-25-09-05-17.jpg)
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. చనిపోవడానికి ముందు ఆమె తన అరచేతిపై రాసుకున్న సూసైడ్ నోట్లో ఓ SI తనపై గత ఐదు నెలల్లో నాలుగు సార్లు అత్యాచారం చేశాడని ఆరోపించింది. శుక్రవారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న ఈ మహిళా డాక్టర్, తనను మానసికంగా, శారీరకంగా ఎస్సై గోపాల్ బద్నే వేధించినట్లుగా తన చేతిపై రాసుకున్న లేఖలో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె ఆ నోట్లో స్పష్టం చేసింది.
ఎంపీ హస్తం కూడా ఉందా?
ఇప్పుడు ఈ ఆత్మహత్య కేసులో రాజకీయ హస్తం అనే అనుమానం ఉందా అని సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదేశాల మేరకు, ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారి గోపాల్ బద్నేను ఉన్నతాధికారులు తక్షణమే సస్పెండ్ చేశారు. అయితే మహిళా డాక్టర్ తన సూసైడ్ నోట్లో ఒక ఎంపీ పేరును కూడా
మెన్షన్ చేశారు. పోలీసు కేసుల్లో నిందితుల నకిలీ ఫిట్నెస్ సర్టిఫికేట్ జారీ చేయమని తనపై ఒత్తిడి తెస్తున్నారని, తాను నిరాకరించినప్పుడు రేప్ చేశారని నోట్ రాశారు. అందులో ఒక ఎంపీ, అతని ఇద్దరు వ్యక్తిగత సహాయకుల పేర్లను కూడా రాశారు. వారు కూడా తనపై ఒత్తిడి తీసుకువచ్చారని రాసి పెట్టింది.
మహరాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన 28 ఏళ్ళ వైద్యురాలు..ఫల్తాన్ తహసిల్ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. గురువారం రాత్రి ఆమె ఒక హోటల్ గదిలో ఉరివేసుకుని కనిపించారు. చనిపోయే ముందు తన అరచేతిలో నోట్ రాసి పెట్టి మరీ ఆత్మహత్య చేసుకున్నారు. గత ఐదు నెలలుగా పోలీసు సబ్-ఇన్స్పెక్టర్ ,మరొక వ్యక్తి తనను అత్యాచారం చేశారని..మానసికంగా వేధించారని డాక్టర్ ఆరోపించారు. ఫల్టన్ గ్రామీణ పోలీసు శాఖకు చెందిన ముగ్గురు అధికారులు తనను వేధించినట్లు పేర్కొంది. బద్నేతో పాటు పాటిల్, లద్పుత్రే అనే అధికారుల పేర్లను కూడా ఆమె వెల్లడించింది. తన ఫిర్యాదుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో ఆమె విజ్ఞప్తి చేసింది.
Follow Us